న్యూఢిల్లీ: దేశంలో కరోనా రోజు రోజుకీ విజృంభిస్తోంది. కొత్త కేసులు నమోదులో మరో రికార్డు సృష్టించింది. 24 గంటల్లో 13,586 కేసులు నమోదయ్యాయి. 336 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,80,532కు, మృతుల సంఖ్య 12,573కి చేరుకుందని శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. రోజుకి 10 వేలు దాటి కేసులు నమోదు కావడం వరసగా ఇది ఎనిమిదో రోజు. జూన్ 1 నుంచి 19 మధ్య 1,89,997 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాత భారత్ ఉంది.
ప్రైవేటు ఆస్పత్రికి సత్యేందర్ జైన్
కరోనా వైరస్ సోకిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఆయనకు న్యుమోనియా కూడా సోకడంతో సాకేత్లోని మ్యాక్స్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆయనకు ప్లాస్మా థెరపీ చేసే అవకాశాలున్నాయి.
మూతబడిన కర్ణాటక సీఎం కార్యాలయం
శివాజీనగర: కర్ణాటక ముఖ్యమంత్రి యెడియూరప్ప కార్యాలయం, అధికారిక నివాసం కూడా అయిన కృష్ణలో పనిచేసే ఓ ఉద్యోగిని భర్తకు కోవిడ్ పాజిటివ్గా తేలింది. దీంతో శానిటైజేషన్ కోసం కార్యాలయాన్ని మూసివేశారు. ముఖ్యమైన సమావేశాలన్నీ యెడియూరప్ప విధాన సౌధలో నిర్వహించారు.
2 లక్షలు దాటిన రికవరీ కేసులు
కోవిడ్–19 బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య బాగా పెరగడం మన దేశానికి అత్యంత ఊరటనిస్తోంది. ఇప్పటివరకు 2,04,710 మంది రోగులు కరోనా నుంచి కోలుకుంటే , 1,63,248 మంది చికిత్స పొందుతున్నారు. రికవరీ రేటు 53.79శాతానికి చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు.
చైనాలో ఇటీవల 37 కొత్త కరోనా కేసులు రాగా, అందులో 25 కేసులు బీజింగ్లో వచ్చాయి. బీజింగ్లో కనిపించిన కరోనా వైరస్కు యూరోప్ వైరస్కు సంబంధాలు ఉన్నాయని చైనా వైరాలజిస్టులు తెలిపారంటూ గ్లోబల్ టైమ్స్ పత్రిక శుక్రవారం ఓ కథనం ప్రచురించింది. ప్రస్తుతం బీజింగ్లో 183 మంది కరోనా వైరస్ బాధితులు చికిత్స పొందుతున్నారు.
కేసుల్లో మళ్లీ రికార్డు
Published Sat, Jun 20 2020 3:42 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement