దండియాత్రకు సాక్షిగా నిలిచిన అవ్వ ఓటు | 106-yr-old woman witness to Dandi March votes in Gujarat poll | Sakshi
Sakshi News home page

దండియాత్రకు సాక్షిగా నిలిచిన అవ్వ ఓటు

Dec 9 2017 3:52 PM | Updated on Aug 21 2018 2:39 PM

106-yr-old woman witness to Dandi March votes in Gujarat poll - Sakshi

సాక్షి, గాంధీనగర్‌ : జాతిపిత మహాత్మా గాంధీ 1930లో నిర్వహించిన దండి సత్యాగ్రహం యాత్రకు ప్రత్యక్ష సాక్షి,  106 ఏళ్ల వద్ధురాలు మోత్లీ బా గుజరాత్‌ అసెంబ్లీకి శనివారం జరిగిన మొదటి విడత పోలింగ్‌లో పాల్గొని ఓటు వేశారు. ఆ తర్వాత ఆమె గర్వంగా వేలిపై ఓటువేసినట్లు సిరా గుర్తును చూపిస్తూ మీడియాకు ఫోజిచ్చారు. ఆమె సూరత్‌లో ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసినట్లు తెలియజేస్తూ ఆకాశవాణి ట్వీట్‌ చేసింది. మొదటి విడతగా ఈ రోజు 89 సీట్లకు జరిగిన ఎన్నికల్లో 977 మంది అభ్యర్థులు తమ అదష్టాన్ని పరీక్షించుకుంటున్న విషయం తెల్సిందే. వారిలో గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని సహా పలువురు ప్రముఖులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement