‘నాన్నా.. ఇది సమ్మర్‌ అని నాకు తెలుసు’

Yash Shares Cute Pic With Daughter Of Her New Haircut - Sakshi

కేజీఎఫ్‌ స్టార్‌ యశ్‌, ఆయన భార్య రాధికా పండిట్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. సినిమాలతో పాటు కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చే ఈ స్టార్‌ కపుల్‌ తమకు సంబంధించిన అప్‌డేట్స్‌ను అభిమానులతో పంచుకుంటారు. కాగా బుధవారం మైసూరు జిల్లాలోని నంజనగూడిలోని శ్రీకంఠేశ్వర ఆలయంలో యశ్‌ దంపతులు తమ కూతురు ఐరాకు కేశ ఖండన చేయించారు. ఈ క్రమంలో యశ్‌ ఐరాతో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. గుండుతో ఉన్న ఐరా తండ్రిని కోపంగా చూస్తున్నట్లుగా ఉన్న ఈ ఫొటోకు... ‘‘ ఐరా: నాన్నా.. ఇది సమ్మర్‌ అని నాకు తెలుసు.. కానీ ఇది సమ్మర్‌ కట్‌ కాదని కచ్చితంగా చెప్పగలను!!! డాడ్‌: పర్లేదు.. నాన్నా!!’’అంటూ క్యాప్షన్‌ను జతచేశాడు.

ప్రస్తుతం ఈ ఫొటో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇప్పటికే 8 లక్షలకు పైగా లైకులు సాధించిన ఈ తండ్రీ, కూతుళ్ల ‘సంభాషణ’కు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ‘‘ఐరా కూడా మీలాగే ఎంతో క్యూట్‌గా ఉంది. తనలా ముద్దుముద్దుగా మాట్లాడితే వినాలని ఉంది’’అని అంటూ కామెంట్లు పెడుతున్నారు.

కాగా కేజీఎఫ్‌ సినిమా ద్వారా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యశ్‌.. ప్రస్తుతం కేజీఎఫ్‌: చాప్టర్‌ 2తో బిజీగా ఉన్నాడు. ప్రాణాంతక వైరస్‌ కరోనా వ్యాప్తి కారణంగా షూటింగ్‌కు కాస్త విరామం ఇచ్చిన ఈ కన్నడ హీరో.. వ్యక్తిగత శుభ్రత పాటించడం, తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. ఈ క్రమంలో ఇటీవల తన భార్య రాధిక 35 పుట్టినరోజు సందర్బంగా వేడుకలకు దూరంగా ఉన్నట్లు ప్రకటించాడు. కాగా వివిధ సినిమాల్లో కలిసి నటించిన యశ్‌- రాధిక 2016లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి కూతురు ఐరా, ఓ కొడుకు సంతానం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top