‘గోవిందుడు’ని మెచ్చుకున్న ఎంపీ కవిత | TRS MP Kavitha Meets Geetha Govindam Team | Sakshi
Sakshi News home page

Aug 23 2018 3:35 PM | Updated on Aug 23 2018 4:13 PM

TRS MP Kavitha Meets Geetha Govindam Team - Sakshi

‘గీత గోవిందం’ మూవీ హవా ఇప్పట్లో తగ్గేలా లేదు. 

విజయ్‌ దేవరకొండ ‘అర్జున్‌ రెడ్డి’తో ఎంత సందడి చేశాడో అందరికీ తెలిసిందే. విజయ్‌ తాజా చిత్రం ‘గీత గోవిందం’ టాలీవుడ్‌లో  దూసుకెళ్తోంది. వసూళ్లలో ట్రేడ్‌ పండితులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికే దాదాపు 40కోట్లు కొల్లగొట్టినట్టు సమాచారం. చూస్తుంటే ఈ మూవీ హవా ఇప్పట్లో తగ్గేలా లేదు. 

ఈ మూవీని వీక్షించిన సినీ ప్రముఖుల రాజమౌళి, చిరంజీవి, మహేష్‌ బాబు, రామ్‌చరణ్‌ ప్రశంసల వర్షాన్ని కురిపించారు. ఇప్పుడు తాజాగా టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత ఈ చిత్రం బృందాన్ని అభినందించారు. మంచి కుటుంబ కథాచిత్రాన్ని అందించినందుకు దర్శకుడు పరశురామ్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. 

ఈ సినిమా ఓవర్సీస్‌లో కూడా రికార్డులు సృష్టిస్తోంది. అర్జున్‌ రెడ్డి వసూళ్లను అధిగమించి.. రెండు మిలియన్‌ డాలర్లకు పరిగెడుతోంది. ఇప్పటికీ హౌస్‌ఫుల్‌ రన్‌తో ఈ సినిమా నడుస్తోంది. విజయ్‌ దేవరకొండ, రష్మిక మందాన జోడిగా నటించిన ఈ సినిమాకు గోపి సుందర్‌ సంగీతాన్ని అందించగా.. పరశురామ్‌ దర్శకత్వం వహించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement