ట్రాక్‌లోనే ఉంది

Tapsee Pannu new movie updates - Sakshi

తాప్సీ, భూమి ఫడ్నేకర్‌ ముఖ్య తారలుగా బాలీవుడ్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో తాప్సీ, భూమి గన్‌ షూటర్స్‌గా నటించనున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన చంద్రో అండ్‌ ప్రకాషి తోమర్‌ అనే షార్ప్‌ షూటర్స్‌ జీవితాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ ఈ చిత్రానికి నిర్మాత. అయితే అనురాగ్‌ కశ్యప్‌ ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా ఈ సినిమా ఆగిపోయిందని బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ విషయం గురించి అనురాగ్‌ స్పందించారు.

‘‘ఈ సినిమా ఆగిపోయిందనే వార్తల్లో నిజం లేదు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. వచ్చే నెల 10న షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం’’ అని అనురాగ్‌ ట్వీట్‌ చేశారు. ‘‘ఈ సినిమా గురించి నన్ను ఇప్పటివరకు చాలా మంది అడిగారు. నాకు తెలిసినంతవరకు ఈ సినిమా సరైన ట్రాక్‌లోనే ఉంది. త్వరలో మరిన్ని విషయాలు తెలుస్తాయి’’ అని తాప్సీ పేర్కొన్నారు. ప్రస్తుతం ‘మిషన్‌ మంగళ్‌’ సినిమాతో తాప్సీ, ‘పతీ పత్నీ ఔర్‌ ఓ’ చిత్రంతో భూమి బిజీ బిజీగా ఉన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top