ధృవలో అరవింద్ స్వామికి డబ్బింగ్ ఎవరు..? | Sakshi
Sakshi News home page

ధృవలో అరవింద్ స్వామికి డబ్బింగ్ ఎవరు..?

Published Thu, Dec 1 2016 10:10 PM

ధృవలో అరవింద్ స్వామికి డబ్బింగ్ ఎవరు..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా.. అరవింద్ స్వామి విలన్గా కనిపించనున్నాడు. తమిళ సూపర్ హిట్ సినిమా తనీఒరువన్కు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. అందుకే ఎంతో మందిని సంప్రదించిన తరువాత ఒరిజినల్ వర్షన్లో నటించిన అరవింద్ స్వామినే ఆ పాత్రకు తీసుకున్నారు.

అయితే ఇంత ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్కు తెలుగులో డబ్బింగ్ ఎవరు చెపుతున్నారు. అన్న చర్య జరుగుతోంది. తమిళ నటుడైన అరవింద్ స్వామి తెలుగులో స్వంతంగా డబ్బింగ్ చెప్పుకోలేడు. అందుకే తెలుగులో ఈ పాత్రకు ఓ యువ గాయకుడితో డబ్బింగ్ చెప్పించారట. గతంలో స్నేహితుడు సినిమాలో విజయ్కి డబ్బింగ్ చెప్పిన గాయకుడు హేమచంద్ర, ధృవ సినిమాలో అరవింద్ స్వామికి డబ్బింగ్ చెపుతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్లో హేమచంద్ర వాయిస్కు మంచి మార్కులే పడ్డాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement