
వరుణ్తేజ్ సరసన...
మలయాళ చిత్రం ‘ప్రేమమ్’లో మలర్ పాత్రలో అక్కడి వాళ్లనే కాకుండా మొత్తం దక్షిణాదిని తనవైపు తిప్పుకున్న కథానాయిక సాయిపల్లవి.
మలయాళ చిత్రం ‘ప్రేమమ్’లో మలర్ పాత్రలో అక్కడి వాళ్లనే కాకుండా మొత్తం దక్షిణాదిని తనవైపు తిప్పుకున్న కథానాయిక సాయిపల్లవి. ఇప్పుడామె తెలుగులో కూడా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. వరుణ్తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘దిల్’ రాజు ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సాయిపల్లవిని కథానాయికగా ఎంపిక చేశారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ- ‘‘అమెరికాలో ఉండే అబ్బాయికి , తెలంగాణలో పెరిగిన అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథ ఇది.
జూలై 25న షూటింగ్ ప్రారంభిస్తాం. అక్టోబరుతో చిత్రీకరణ పూర్తి చేసి డిసెంబరులో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేశ్, సినిమాటోగ్రఫీ: విజయ్కుమార్.