కేరాఫ్‌ తూర్పు గది | 'Roshini Kare off thurupu gadhi ' is a comedy movie with horror. | Sakshi
Sakshi News home page

కేరాఫ్‌ తూర్పు గది

Jun 16 2017 12:16 AM | Updated on Sep 5 2017 1:42 PM

కేరాఫ్‌ తూర్పు గది

కేరాఫ్‌ తూర్పు గది

మున్నా, ప్రియాంక, మధుశ్రీ ముఖ్య తారలుగా శరగడం శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రోషిణి కేరాఫ్‌ తూర్పుగది’.

మున్నా, ప్రియాంక, మధుశ్రీ ముఖ్య తారలుగా శరగడం శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రోషిణి కేరాఫ్‌ తూర్పుగది’. శ్రీవారి క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎస్‌.శ్రీనివాస్, ఎస్‌.సుధీర్‌ నిర్మిస్తున్నారు. రాజ్‌ కిరణ్‌ సంగీత దర్శకుడు. ప్రస్తుతం ఈ చిత్రం రెండో షెడ్యూల్‌ జరుపుకుంటోంది. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘హార్రర్‌తో కూడిన కామెడీ చిత్రమిది.

భువనగిరి గౌరీ శంకర్‌ విలన్‌గా, రంజీత్‌కుమార్‌ పోలీసాఫీసర్‌గా తమ పాత్రలకు న్యాయం చేస్తున్నారు. పాలకొల్లు, నర్సాపురంలో తర్వాతి షెడ్యూల్‌ను ప్లాన్‌ చేస్తున్నాం. రాజ్‌కిరణ్‌ మంచి పాటలు ఇచ్చారు’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: నండూరి వీరేషం.

Advertisement
 
Advertisement
Advertisement