
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాపై రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. షూటింగ్ ప్రారంభమై చాలా కాలం అవుతున్నా ఇంత వరకు ఈసినిమా టైటిల్ లోగోను రిలీజ్ చేయలేదు. పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఓ ఆడియో టీజర్ రిలీజ్ చేసినా.. అది అభిమానులకు పూర్తి సంతృప్తినివ్వలేదు. దీంతో దసర సందర్భంగా ఏదైన అప్ డేట్ వస్తుంది అభిమానులు ఎదురుచూశారు.
కానీ మరోసారి అభిమానులను నిరాశపరిచిన పవన్, త్రివిక్రమ్ టీం దీపావళికి టీజర్ ను టైటిల్ లోగోను రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూల్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈసినిమాలో ఖుష్బూ, ఇంద్రజలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా జనవరి 10న రిలీజ్ కానుంది.