సమస్యలతో పోరాటం

సమస్యలతో పోరాటం - Sakshi


ఎన్నో ఆశలతో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టిన ఓ అమ్మాయి... అక్కడ ఎలాంటి సమస్యలను ఎదుర్కొంది? అనే కథాంశంతో మలయాళంతో రూపొందిన చిత్రం ‘తలసమయమ్ ఒరు పెన్‌కుట్టి’. నిత్యామీనన్, ఉన్ని ముకుందన్, శ్వేతామీనన్ ప్రధాన పాత్రధారులు. టి.కె.రాజీవ్‌కుమార్ దర్శకుడు. ఈ చిత్రం తెలుగులో ‘ఈ వేళలో’ పేరుతో విడుదల కానుంది. వల్లభనేని అశోక్‌కుమార్ ఈ అనువాద చిత్రానికి నిర్మాత. జీవితా రాజశేఖర్ సమర్పకురాలు. శ్రీశరత్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. జయసుధ ఆడియో సీడీని ఆవిష్కరించి సముద్రాల గోవిందరాజులుకు అందించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top