రేపు నడిగర్‌ సంఘ కార్యవర్గం అత్యవసర సమావేశం | Nadigar Sangam Emergency Meeting In Chennai | Sakshi
Sakshi News home page

రేపు నడిగర్‌ సంఘ కార్యవర్గం అత్యవసర సమావేశం

May 13 2019 10:38 AM | Updated on May 13 2019 10:38 AM

Nadigar Sangam Emergency Meeting In Chennai - Sakshi

పెరంబూరు: మంగళవారం ఉదయం దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యవర్గ అత్యవసర సమావేశం జరగనుంది. 2015లో జరిగిన ఈ సంఘం ఎన్నికల్లో నాజర్‌ జట్టు విజయం సాధించింది. విశాల్‌ కార్యదర్శిగా, నటుడు కార్తీ కోశాధికారిగా కార్యవర్గం బాధ్యతలను చేపట్టారు. మూడేళ్లకోసారి జరిగే ఈ సంఘ కార్యవర్గానికి గత ఏడాదిలోనే కాలపరిమితి ముగిసింది. అయితే సంఘ నూతన భవన నిర్మాణం పూర్తయ్యే దశలో ఉండడంతో ఎన్నికలను వాయిదా వేశారు. నడిగర్‌సంఘం ఎన్నికలు జూన్‌లో జరగనున్న పరిస్థితుల్లో మరోసారి నాజర్‌ జట్టు బరిలోకి దిగుతోంది. ఈ జట్టుకు వ్యతిరేకంగా నటి రాధిక జట్టు బరిలో ఢీకొనడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ నేపథ్యంలో కార్యవర్గం మంగళవారం స్థానిక టీ.నగర్‌లోని ఒక నక్షత్ర హోటల్‌లో అత్యవసరంగా సమావేశం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement