భారీ మల్టీస్టారర్‌.. మొదలవుతోంది

Mani Ratnam multi starrer title logo launched - Sakshi

సాక్షి, చెన్నై : పుకార్లకు పుల్‌ స్టాప్‌ పడిపోయింది. క్లాసిక్‌ చిత్రాల దర్శకుడు మణిరత్నం భారీ మల్టీస్టారర్‌ను అధికారికంగా ప్రకటించేశారు. చిత్ర తారాగణంతోపాటు వారి టైటిల్‌ లోగోను కూడా విడుదల చేసేశారు. 

తమిళ్‌లో ‘చెక్క చివంత వానమ్‌’ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగులో ‘నవాబ్‌’ గా రానుంది. ఇక కాస్టింగ్‌ విషయానికొస్తే... శింబు, విజయ్‌ సేతుపతి, అరవింద్‌ స్వామి పేర్లను ఇది వరకే ప్రకటించగా... ఇప్పుడు అదనంగా అరుణ్‌ విజయ్‌(బ్రూస్‌ లీ ఫేమ్‌) జత కలిశాడు. ముందుగా మళయాళ నటుడు పహద్‌​ ఫజిల్‌ పేరు అనుకున్నప్పటికీ.. డేట్లు అడ్జస్ట్‌ కాకపోవటంతో ఆ ప్లేస్‌లో అరుణ్‌ విజయ్‌ను తీసుకున్నారు. 

జ్యోతిక, ఐశ్వర్య రాజేష్‌, అదితి రావ్‌ హైదరి, డయానా హీరోయిన్లుగా.. ప్రకాశ్‌ రాజ్‌, త్యాగరాజన్‌, మన్‌సూర్‌ అలీఖాన్‌, జయ సుధ తదితరులు కీలకపాత్రలు పోషించబోతున్నారు. మద్రాస్‌ టాకీస్‌, లైకా ప్రొడక్షన్స్‌ హౌజ్‌ వారు సంయుక్తంగా ఈ భారీ మల్టీస్టారర్‌ను తెరకెక్కించనున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రం ఫిబ్రవరి 12 నుంచి షూటింగ్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top