-
ధనుష్, నాగార్జున మల్టీస్టారర్ ప్రాజెక్ట్..!
-
‘మెగా’ డైరెక్టర్తో ‘అక్కినేని’మల్టీస్టారర్.. స్క్రిప్ట్ రెడీ!
తండ్రీకొడుకు నాగార్జున, అఖిల్ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ ఫిల్మ్ రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారట మోహన్ రాజా. ప్రస్తుతం ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారట. కాగా ఈ మధ్య వరుసగా యాక్షన్ సినిమాలతో బిజీగా గడిపారు నాగార్జున. ఓ చిన్న బ్రేక్ తర్వాత ఈ సినిమాను ఆరంభించాలనే ఆలోచనలో ఉన్నారట నాగార్జున. (చదవండి: గాడ్ ఫాదర్ ఆ రేంజ్ బ్లాక్బస్టర్) ఈలోపు అఖిల్ కూడా తన తాజా చిత్రం ‘ఏజెంట్’ను దాదాపు పూర్తి చేసేస్తారట. ఆ తర్వాత తండ్రితో కలిసి చేయనున్న సినిమా సెట్స్లో అడుగుపెడతారని టాక్. ఇదిలా ఉంటే.. ఇది నాగార్జున కెరీర్లో వందో చిత్రం అనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
నాగ్ మల్టీస్టారర్ ఆగిపోయిందా..?
ఈ ఏడాది దేవదాసు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కింగ్ నాగార్జున తరువాత ఒక్క తెలుగు సినిమా కూడా అంగీకరించలేదు. బాలీవుడ్లో అతిథి పాత్రలో నటిస్తున్న బ్రహ్మాస్త్ర షూటింగ్ పూర్తి చేసిన నాగ్, కోలీవుడ్లో మరో మల్టీస్టారర్కు ఓకె చెప్పాడు. పవర్ పాండి సినిమాతో దర్శకుడిగా మారిన తమిళ స్టార్ హీరోగా ధనుష్ ఓ భారీ మల్టీస్టారర్ను డెరెక్ట్ చేసేందుకు రెడీ అయ్యాడు. ముందుగా ఈ మల్టీస్టారర్లో రజనీకాంత్ను నటింప చేసేందుకు ప్రయత్నాలు జరిగినా.. తరువాత ఆ స్థానంలో నాగార్జునను తీసుకున్నారు. పూజ కార్యక్రమాలు కూడా జరుపుకున్న ఈ సినిమా ఇంత వరకు పట్టాలెక్కలేదు. అయితే ఇటీవల ధనుష్ మారి 2 రిలీజ్ తరువాత మల్టీస్టారర్ పనులు ప్రారంభిస్తారని అంతా భావించారు. అయితే మారి 2 రిలీజ్ అయిన వెంటనే ధనుష్ , అసురన్ అనే మరో సినిమాను ఎనౌన్స్ చేశాడు. అసురన్ షూటింగ్ జనవరిలోనే ప్రారంభమవుతుందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ధనుష్ డైరెక్ట్ చేయబోయే మల్టీస్టారర్ ఆగిపోయిందన్న ప్రచారం మొదలైంది. తేనాండల్ మూవీస్ ఆర్థిక సమస్యలు కూడా ఈ ప్రాజెక్ట్ ను పక్కకు పెట్టడానికి ఓ కారణం అని తెలుస్తోంది. ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే చిత్రయూనిట్ నుంది అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
నాగ్, ధనుష్ మల్టీస్టారర్కు టైటిల్ ఫిక్స్
నటుడు ధనుష్ జోడు గుర్రాల పయనాన్ని జోరుగా సాగిస్తున్నారు. నటుడు, దర్శకుడు, రచయిత, నిర్మాత అంటూ పలు కోణాలు ఉన్నాయి. ధనుష్ ప్రస్తుతం నటుడిగా, నిర్మాతగా బిజీగా ఉన్నారు. అదే సమయంలో దర్శకుడిగానూ దూసుకుపోతున్నారు. ధనుష్ నటించిన తాజా చిత్రం వడచెనై ఇటీవల తెరపైకి వచ్చి కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటిస్తున్న ఎన్నై నోక్కి పాయుమ్ తోట్టా, బాలాజిమోహన్ దర్శకత్వంలో నటించి నిర్మిస్తున్న మారి–2 చిత్రాలు వరుసగా విడుదలకు ముస్తాబవుతున్నాయి. వడచెన్నై చిత్ర దర్శకుడు వెట్రిమారన్ త్వరలో ధనుష్తో మరో చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఇది వెక్కై అనే నవల ఆధారంగా తెరకెక్కనున్నట్లు సమాచారం. సత్యజ్యోతి ఫిలింస్ సంస్థలో ధనుష్ నటించనున్నారట. ఈ సంస్థ ప్రస్తుతం అజిత్ హీరోగా విశ్వాసం చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇది వచ్చే ఏడాది సంక్రాంతి సంబరాలకు సిద్ధం అవుతోంది. సత్యజ్యోతి ఫిలింస్ టీజే.త్యాగరాజన్ నటుడు ధనుష్ హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇటీవల రాక్షసన్ చిత్రంతో విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు రామ్కుమార్ దర్శకత్వంలోనూ ధనుష్ ఒక చిత్రం చేయనున్నారు. ప్రస్తుతం ధనుష్ హీరోగా నటిస్తూనే ఒక మల్టీస్టారర్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. బహుభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో టాలివుడ్ స్టార్ నటుడు నాగార్జున మరో హీరోగా నటిస్తున్నారు. దర్శకుడు ఎస్జే.సూర్య, నటి అదితిరావు తదితర భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి నాన్ రుద్రన్ అనే టైటిల్ను నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఈ చిత్ర కథలో 15వ శతాబ్ధానికి సంబంధించిన సన్నివేశాలుంటాయని, ఆ ఎపిసోడ్లోనే నాగార్జున కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. -
రాజమౌళి మల్టీస్టారర్పై ఇంట్రస్టింగ్ న్యూస్
బాహుబలి సక్సెస్ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రాజమౌళి ప్రస్తుతం ఓ భారీ మల్టీస్టారర్ను మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ల కాంబినేషన్లో జక్కన్న దర్శకత్వంలో మల్టీస్టారర్ సినిమా తెరకెక్కనుందని ఇప్పటికే ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్కు వెళ్లనుందని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్లో హల్చల్ చేస్తోంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ స్వాతంత్ర్యోధ్యమ కాలానికి సంబంధించిన కథ అని తెలుస్తోంది. ఇప్పటికే రెడీ అవుతున్న సెట్స్, ప్రాపర్టీస్ అన్ని ఆ కాలానికి తగ్గట్టుగా డిజైన్ చేస్తున్నారట.డిసెంబర్ నుంచి ప్రారంభం కానున్న తొలి షెడ్యూల్లో ఎన్టీఆర్ పాల్గొననున్నాడు చరణ్ కాస్త ఆలస్యంగా ఆర్ఆర్ఆర్ టీంతో జాయిన్ కానున్నాడట.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూ.2.71 లక్షల వంచన
ఎన్నికల సామగ్రితో తరలిన సిబ్బంది
జిల్లాలో నేటి ఓటింగ్కు సర్వం సిద్ధం
ఓటుకు రూ.100–200ల పంపిణీ
సురపుర విజేత ఎవరో?
ముగ్గురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు
ట్రాక్టర్ ఇంజిన్ బోల్తా పడి డ్రైవర్ మృతి
నేడే మలివిడత ఎన్నికలు
ఎమ్మెల్యే కారును ఢీకొని ఇద్దరు మృతి
నేటి పోలింగ్కు అన్ని ఏర్పాట్లు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement