బ్యాక్‌ టు ఇండియా

maharshi team nov 2 on come back india - Sakshi

ప్రయాణంలో భాగంగా అమెరికా వెళ్లారు మహర్షి. ఆయన పని దాదాపు పూర్తి కావొచ్చిందట. దాంతో తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డే కథానాయిక. అశ్వినీదత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్‌బాబు రిషి అనే పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. నవంబర్‌ 2న ఈ టీమ్‌ తిరిగి ఇండియా వచ్చేస్తారట.

తదుపరి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్రత్యేకంగా రూపొందించిన సెట్లో ప్రారంభించనున్నారని సమాచారం. ఈ సెట్‌ పల్లెటూరు వాతావరణాన్ని తలపించేలా ఉంటుందట. మిగిలిన భాగం చిత్రీకరణ ఎక్కువ శాతం ఇక్కడే జరుపుతారని తెలిసింది. ఈ సినిమాలో మహేశ్‌ రెండు డిఫరెంట్‌ షేడ్స్‌లో కనిపించనున్నారు. మహేశ్‌బాబు స్నేహితుడి పాత్రలో ‘అల్లరి’ నరేశ్‌ నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఉగాది స్పెషల్‌గా ఏప్రిల్‌ 5న రిలీజ్‌ కానున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రాసాద్‌. కెమెరా: కేయు మోహనన్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top