చోళ రాజుల కథలో...

Jayaram to star in Mani Ratnam's film Ponniyin Selvan - Sakshi

ప్రస్తుతం తమిళంలో అందరి చూపు మణిరత్నం తెరకెక్కించబోయే ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ మీదే ఉందని చెప్పొచ్చు. చోళుల కథ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఐశ్వర్యా రాయ్, విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, నయనతార, అనుష్క, కీర్తీ సురేశ్, అమలా పాల్‌ వంటి నటీనటులు ఈ సినిమాలో కనిపించబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ఈ సినిమాలో మలయాళ నటుడు జయరామ్‌ కూడా కనిపిస్తారని తెలిసింది. ఓ ఇంటర్వ్యూలో ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చేస్తున్నట్టు జయరామ్‌ ప్రకటించారు. తన పాత్ర ఎలా ఉంటుందనే విషయం మాత్రం చెప్పలేదు. జయరామ్‌ ప్రస్తుతం తెలుగులో ‘అల వైకుంఠపురములో’ యాక్ట్‌ చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top