పారితోషికం భారీగా పెంచేసిన షాహిద్ కపూర్

After Kabir Singh Success Shahid Kapoor Hiked His Fee - Sakshi

దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలని సామెత. మిగతా చోట్ల ఏమో గానీ ఇండస్ట్రీలో మాత్రం ఈ సామెతను చక్కగా పాటిస్తారు. చేతిలో ఓ హిట్టు పడగానే పారితోషికం భారీగా పెంచేస్తారు నటీనటులు. తాజాగా ఈ సామెతను నిజం చేసే పనిలో పడ్డారట బాలీవుడ్‌ హీరో షాహిద్ కపూర్. తెలుగులో భారీ విజయం సాధించిన అర్జున్‌ రెడ్డిని హిందీలో కబీర్‌ సింగ్‌గా రీమేక్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. షాహిద్ కపూర్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కబీర్‌ సింగ్‌ నిలిచింది.

ఈ సినిమా విజయంతో షాహిద్ కపూర్ తన పారితోషికాన్ని భారీగా పెంచారనే వార్తలు వినిపిస్తున్నాయి. తరువాతి చిత్రం కోసం షాహిద్‌ ఏకంగా రూ. 35 కోట్లు డిమాండ్‌ చేస్తున్నట్లు​వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ వార్తలే నిజమైతే బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల సరసన షాహిద్‌ కూడా చేరతారు. కబీర్‌ సింగ్‌ విడుదలైన నాటి నుంచి ఇప్పటి వరకూ రూ. 240 కోట్లు వసూలు చేసింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top