ఆగస్టులో ఎవరు

adivi sesh evaru first look release - Sakshi

అడివి శేష్‌ కథానాయకుడిగా నటì ంచిన థ్రిల్లర్‌ మూవీ ‘ఎవరు’. ఇందులో రెజీనా కథానాయికగా నటిస్తున్నారు. వెంకట్‌ రామ్‌ జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి, కెవిన్‌ అన్నె నిర్మించారు. నవీన్‌ చంద్ర కీలక పాత్ర చేశారు. అడివి శేష్‌ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. రక్తం అంటిన అద్దాన్ని అడివి శేష్‌కు చూపిస్తూ ఏదో చెప్పాలని రెజీనా ప్రయత్నిస్తున్నట్లు ఫస్ట్‌ లుక్‌లో కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 23న విడుదల చేయాలనుకుంటున్నారు చిత్ర యూనిట్‌. ఈ సినిమాకు సంగీతం: శ్రీచరణ్‌ పాకాల.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top