మెగాస్టార్తో మిస్టర్ పర్ఫెక్ట్
సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి షెడ్యూల్కు చిన్న బ్రేక్ రావటంతో భార్య సురేఖతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ప్రస్తుతం జపాన్లో ఉన్న మెగాస్టార్ను బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కలిశారు. చిరుతో కలిసి దిగిన ఫోటోను తన సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేసిన ఆమిర్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.
నా అభిమాన నటుడు, సూపర్ స్టార్ చిరంజీవి గారిని క్యోటో ఎయిర్పోర్ట్లో కలిశాను. ఎంతో ఆనందంగా ఉంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా గురించి ఆయనతో చర్చించాను. మీరు మాకు ఇన్సిపిరేషన్ సార్’ అంటూ ట్వీట్ చేశాడు ఆమిర్. థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ ఫెయిల్యూర్ తరువాత లాంగ్ బ్రేక్ తీసుకున్న ఆమిర్ ఖాన్ ప్రస్తుతం భారీగా ప్రాజెక్ట్గా రూపొందుతున్న మహాభారత్ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.
Ran into one of my favourite actors, Superstar Chiranjeevi Garu at Kyoto airport! What a pleasant surprise :-) .
Discussed his new project about freedom fighter Uyyalawada Narasimha Reddy. You are always such an inspiration sir 🙏.
Love.
a. pic.twitter.com/qpwqo9sRqt— Aamir Khan (@aamir_khan) 7 April 2019
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు