‘స్మార్ట్‌’గా వ్యాధి నిర్ధారణ! | University of Illinois medical tests tests with smart phone | Sakshi
Sakshi News home page

‘స్మార్ట్‌’గా వ్యాధి నిర్ధారణ!

Aug 13 2017 2:56 AM | Updated on Aug 24 2018 8:18 PM

వ్యాధుల నిర్ధారణకు చేసే రక్త, మూత్ర పరీక్షలు కొంతమేర ఖరీదైనవే. ఈ పరీక్షలు చేసేందుకు బోలెడంత డబ్బు పోసి యంత్రాలు కొనాల్సి రావడం దీనికి కారణం.

వాషింగ్టన్: వ్యాధుల నిర్ధారణకు చేసే రక్త, మూత్ర పరీక్షలు కొంతమేర ఖరీదైనవే. ఈ పరీక్షలు చేసేందుకు బోలెడంత డబ్బు పోసి యంత్రాలు కొనాల్సి రావడం దీనికి కారణం. అమెరికాలోని ఇల్లినాయీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ అడ్డంకిని దాటేశామని చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌తో రక్త, మూత్ర పరీక్షలు నిర్వహించేందుకు ఓ పరికరాన్ని తయారు చేశామని వారు ప్రకటించారు. దాదాపు రూ.40 వేల ఖరీదు చేసే ఈ యంత్రం.. లక్షల విలువైన యంత్రాలకు తీసిపోని ఫలితాలిస్తుందని శాస్త్రవేత్త కన్నింగ్‌హామ్‌ చెప్పారు.

‘ట్రై అనలైజర్‌’అని పిలుస్తున్న ఈ యంత్రం స్మార్ట్‌ఫోన్‌లోని కెమెరాను స్పెక్ట్రోమీటర్‌గా మార్చడం ద్వారా పనిచేస్తుంది. విశ్లేషించాల్సిన ద్రవ నమూనాను ఒక పరికరంలో ఉంచినప్పుడు దీనిపై ఫోన్‌లోని ఎల్‌ఈడీ లైట్‌ కాంతిని ప్రసరింపజేస్తారు. ఇంకోవైపు నుంచి ఆ కాంతిని ఒక ఆప్టిక్‌ ఫైబర్‌ తీగలో సేకరించి ఫోన్‌లోని కెమెరా ఉన్న వైపునకు పంపించి తేడాలు గుర్తించడం ద్వారా ఇది పనిచేస్తుంది. ఈ పరికరం ద్వారా ఒకే సమయంలో ఒకటి కన్నా ఎక్కువ నమూనాలను పరీక్షించవచ్చు. వైద్య పరీక్షలతో పాటు ఈ పరికరాన్ని జంతువుల ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు, మత్తు పదార్థాలు మందులను గుర్తించేందుకు వాడొచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే స్పెక్ట్రోమీటర్‌ అవసరమున్న ప్రతి రంగంలోనూ దీన్ని వాడొచ్చని కన్నింగ్‌హామ్‌ అంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement