ఎన్నారైలు @ 12.5 కోట్లు

UAE-based Indian-origin tycoons pledge Rs 12.5 crore for Kerala - Sakshi

దుబాయ్‌: కేరళను ఆదుకునేందుకు దేశవిదేశాల నుంచి దాతలు స్పందిస్తున్నారు. భారత సంతతికి చెందిన యూఏఈ వ్యాపారవేత్తలు ఆదివారం రూ.12.5 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. కేరళ మూలాలున్న లులూ గ్రూప్‌ చైర్మన్‌ యూసుఫ్‌ అలీ, ఫాతిమా హెల్త్‌కేర్‌ గ్రూప్‌ చైర్మన్‌ కేపీ హుస్సేన్‌ రూ.5 కోట్ల చొప్పున ప్రకటించారు. యునిమొని అండ్‌ యూఏఈ ఎక్సే్ఛంజ్‌ చైర్మన్‌ బీఆర్‌ శెట్టి రూ. 2 కోట్లు, అస్టర్‌ డీఎమ్‌ హెల్త్‌కేర్‌ చైర్మన్, అజద్‌ మూపెన్‌ రూ. 50 లక్షల సాయం చేశారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top