మోదీ చేసిన వ్యాఖ్యలకు మద్దతిచ్చిన పాక్ లోని బలూచిస్తాన్ నాయకులపై కేసులు నమోదయ్యాయి.
కరాచీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు మద్దతిచ్చిన పాకిస్థాన్ లోని బలూచిస్తాన్ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బ్రహందాగ్ బుగ్తీ, హర్బియార్, బనుక్ కరీమాపై దేశద్రోహంతో పాటు పలు సెక్షన్ల కింద బలూచిస్తాన్ లోని ఖుజ్దర్లోని పోలీస్ స్టేషన్లలో ఐదు కేసులు నమోదయ్యాయి.
మోదీకి వ్యతిరేకంగా కుజ్దర్, డేరా బుగ్తీ వంటి పలు ప్రాంతాల్లో గిరిజనులు రోడ్లెక్కి ఆందోళనలు చేసి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.


