బోటు మునిగి 84 మంది గల్లంతు | Ferry sinks off Philippines | Sakshi
Sakshi News home page

బోటు మునిగి 84 మంది గల్లంతు

Sep 14 2014 12:18 AM | Updated on Sep 2 2017 1:19 PM

ఫిలిప్పీన్స్లో ప్రయాణికులతో వెళ్తున్న బోటు నీట మునిగింది.

మనీలా : ఫిలిప్పీన్స్లో ప్రయాణికులతో వెళ్తున్న బోటు శనివారం సాయంత్రం నీట మునిగింది. ఈ ప్రమాదంలో 84 మంది ప్రయాణికులు గల్లంతయ్యారని ఫిలిప్పీన్స్ కోస్ట్గార్డు అధికార ప్రతినిధి వెల్లడించారు.  గల్లంతైనవారిలో 56 మంది పెద్దవాళ్లు, 2 చిన్నారులు, 26 మంది బోటు సిబ్బంది ఉన్నారని వివరించారు. గల్లంతైన వారి కోసం బోట్లతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. అయితే గల్లంతైన వారిలో కొంతమందిని రక్షించామని... ఆ సంఖ్య ఇంత అని మాత్రం ఆ అధికార ప్రతినిధి స్పష్టం చేయలేదు. వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్లే ఆ ప్రమాదం జరిగిందని భావిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement