ఫిలిప్పీన్స్లో ప్రయాణికులతో వెళ్తున్న బోటు నీట మునిగింది.
మనీలా : ఫిలిప్పీన్స్లో ప్రయాణికులతో వెళ్తున్న బోటు శనివారం సాయంత్రం నీట మునిగింది. ఈ ప్రమాదంలో 84 మంది ప్రయాణికులు గల్లంతయ్యారని ఫిలిప్పీన్స్ కోస్ట్గార్డు అధికార ప్రతినిధి వెల్లడించారు. గల్లంతైనవారిలో 56 మంది పెద్దవాళ్లు, 2 చిన్నారులు, 26 మంది బోటు సిబ్బంది ఉన్నారని వివరించారు. గల్లంతైన వారి కోసం బోట్లతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. అయితే గల్లంతైన వారిలో కొంతమందిని రక్షించామని... ఆ సంఖ్య ఇంత అని మాత్రం ఆ అధికార ప్రతినిధి స్పష్టం చేయలేదు. వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్లే ఆ ప్రమాదం జరిగిందని భావిస్తున్నట్లు తెలిపారు.