బాంబుదాడిలో 22 మంది మృతి | Blast kills 22 in Somali capital Mogadishu | Sakshi
Sakshi News home page

బాంబుదాడిలో 22 మంది మృతి

Aug 31 2016 10:13 AM | Updated on Apr 3 2019 3:52 PM

బాంబుదాడిలో 22 మంది మృతి - Sakshi

బాంబుదాడిలో 22 మంది మృతి

హోటల్ బయట జరిగిన శక్తివంతమైన బాంబు పేలుడులో 22 మంది మృతి చెందారు.

మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో తీవ్రవాదులు బాంబుదాడికి పాల్పడ్డారు. సోమాలి యూత్ లీగ్(ఎస్వైఎల్) హోటల్ బయట జరిగిన శక్తివంతమైన బాంబు పేలుడులో 22 మంది మృతిచెందగా పలువురు గాయపడ్డారు. పేలుడు జరిగిన సమయంలో హోటల్లో భద్రతా సమావేశం జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సమావేశాన్ని లక్ష్యంగా చేసుకొనే దాడి జరిగిందని భావిస్తున్నారు.

బాంబు దాడికి పాల్పడింది తామేనంటూ అల్ ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ అల్-షబాబ్ ప్రకటించింది. పేలుడు జరిగిన సోమాలి యూత్ లీగ్ హోటల్.. ప్రభుత్వ అధికారులు, ప్రముఖుల సమావేశాలకు ఆతిథ్యమిస్తుంది. గతంలోనూ ఈ హోటల్ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. బాంబుదాడికి పాల్పడిన ఉగ్రవాది రాకను ముందుగానే గుర్తించిన భద్రతా బలగాలు అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ విపలమైనట్లు తెలుస్తోంది. అల్ షబాబ్ ఉగ్రవాద సంస్థ సోమాలియాలో ఇస్లామిక్ రాజ్య స్థాపన లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement