
500 కి.మీ. దూరంలోని మనుషులనూ చూస్తుంది..
విమానం ఆకారంలోని భారీ బెలూన్లా కనిపిస్తున్న ఈ ఎయిర్షిప్(గగననౌక) 500 కిలోమీటర్ల పరిధిలో కదులుతున్న మనుషులు, అన్ని వాహనాలనూ పసిగడుతుంది.
విమానం ఆకారంలోని భారీ బెలూన్లా కనిపిస్తున్న ఈ ఎయిర్షిప్(గగననౌక) 500 కిలోమీటర్ల పరిధిలో కదులుతున్న మనుషులు, అన్ని వాహనాలనూ పసిగడుతుంది. తీరప్రాంత నిఘా కోసమని అమెరికా సైన్యం దీనిని రూపొందించింది. 24 గంటల పాటు, 360 డిగ్రీల కోణంలో వస్తువుల కదలికలపై ఇది నిఘా పెడుతుంది. రెండు ఎయిర్షిప్లతో ‘జ్లెన్స్’ అనే ఈ వ్యవస్థను మేరీల్యాండ్లోని సైనిక కేంద్రం వద్ద రూ. 17 వేల కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు.
10 వేల అడుగుల ఎత్తులోకి పంపే ఈ ఎయిర్షిప్లలో ఒకటి నిరంతరం తీర ప్రాంతాన్ని స్కానింగ్ చేస్తుంది. మరోటి కచ్చితమైన రాడార్ సాయంతో నేలపై, సముద్రంపై, ఆకాశంలోని వస్తువులను గుర్తిస్తుంది. అయితే, తీరప్రాంత భద్రత కోసమేనని సైన్యం చెబుతున్నా.. సొంత పౌరులపై నిఘా పెట్టేందుకే ఈ ఎయిర్షిప్లను ఏర్పాటు చేస్తున్నారంటూ అమెరికాలో ఇప్పుడు దుమారం రేగుతోంది.