భారీ వర్షాలు, వరదలతో ఇండోనేషియాలోని జావా ప్రావిన్స్ అతలాకుతలమైయింది.
జకార్తా: భారీ వర్షాలు, వరదలతో ఇండోనేషియాలోని జావా ప్రావిన్స్ అతలాకుతలమైయింది. భారీ వరదలు, కొండ చరియలు విరిగిపడి దాదాపు 24 మంది మరణించారు. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు ఆదివారం వెల్లడించారు. ఈ ప్రావిన్స్లోని పలు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. మరో 26 మంది ఆచూకీ గల్లంతు అయిందని చెప్పారు.