తల్వార్లతో విన్యాసాలు కలకలం రేపాయి. ఈ ఘటన ఉప్పల్ లక్ష్మారెడ్డి కాలనీలో చోటుచేసుకుంది.
హైదరాబాద్: తల్వార్లతో విన్యాసాలు కలకలం రేపాయి. ఈ ఘటన ఉప్పల్ లక్ష్మారెడ్డి కాలనీలో చోటుచేసుకుంది. పుట్టినరోజు సందర్బంగా గణేష్ మండపం వద్ద కొందరు వ్యక్తులు కత్తులతో విన్యాసాలు చేశారు. కత్తి విన్యాసాలకు భయపడిన ఉప్పల్ లక్మరెడ్డి కాలనీ వాసులు రాచకొండ సీపీకి ఫోటోలు పంపారు.
దీంతో సీపీ ఆదేశాల మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారు. మారణాయుధాలు ఎక్కడ నుండి తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? ఎవరు వాటితో ట్రైనింగ్ ఇస్తున్నారు? అనే కోణంలో ఎస్ఓటీ పోలీసుల ఆరా తీస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.