రైలు కిందపడి కూలీ మృతి | worker killed in Rail Accident | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి కూలీ మృతి

Mar 20 2016 8:06 PM | Updated on Mar 22 2019 1:41 PM

రైలు కిందపడి ఓ కూలీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది.

 రైలు కిందపడి ఓ కూలీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ ఆర్.లాల్యానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి ప్రాంతానికి చెందిన లింగంపల్లి నాగరాజు (28) కూలీ పని చేస్తుంటాడు. ఇతనికి ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.

నాగరాజు మానసిక పరిస్థితి బాగాలేనందున అతని భార్య రెండు సంవత్సరాల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తాగుడుకు బానిసై ఆదివారం ఉదయం సీతాఫల్‌మండి - ఆర్ట్స్ కాలేజీ రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement