సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ట్రంలో తమకు ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో ఉన్న లక్షలాది మంది అభ్యర్థులు.. గ్రూప్స్ పరీక్షల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. పరీక్షల కోసం రాత్రీపగలూ కుస్తీ పడుతూ, శిక్షణ తీసుకుంటున్నారు. వెంటనే గ్రూప్స్ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)ను డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు దాదాపు 25 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అందులో సుమారు 15 వేల పోస్టులకు అనుమతినిచ్చినా... వీటిల్లో గ్రూప్స్ పోస్టులు చాలా తక్కువ. దీంతో వీటి భర్తీపైనా టీఎస్పీఎస్సీ తర్జనభర్జన పడుతోంది. ప్రతి లక్ష మందికి 100 పోస్టులు కూడా లేని పరిస్థితుల్లో నోటిఫికేషన్ జారీ చేయడం సరికాదని భావిస్తోంది. మరిన్ని పోస్టులకు అనుమతి వస్తే... అన్నింటికీ కలిపి నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తోంది. మరోవైపు అభ్యర్థులు మాత్రం ముందుగా ఉన్న పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయాలని కోరుతున్నారు.
మరిన్ని పోస్టులు ఎప్పుడు వచ్చేనో?
రాష్ట్రంలో సుమారు 25 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో 15,522 పోస్టుల భర్తీకి సీఎం నాలుగు నెలల కిందే ఆమోద ముద్ర వేశారు. అందులో టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు మూడు వేల పోస్టులకు ఆమోదం తెలపగా... వీటిలో రెండు వేల వరకు ఇంజనీర్ పోస్టులే ఉన్నాయి. పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న గ్రూప్-1 పోస్టులు 52 ఉండగా, గ్రూప్-2 పోస్టులు 434 మాత్రమే ఉన్నాయి. గ్రూప్-3, గ్రూప్-4 పోస్టులే లేవు. ఇక మరో 10 వేల పోస్టులకు ఆమోదం కోసం ఆర్థిక శాఖ ఫైలును ముఖ్యమంత్రి కార్యాలయానికి రెండు నెలల కిందే పంపించింది. దానికి ఇంకా ఆమోదం రాలేదు. అయితే అందులో మరిన్ని గ్రూప్-1, 2 పోస్టులతో పాటు గ్రూప్-3, 4 పోస్టులు ఉంటాయని కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి. ఎక్కువ మంది ఎదురుచూసే గ్రూప్-2 కేటగిరీలో 2 వేలకు పైగా పోస్టులు వస్తే బాగుంటుందన్న భావన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో గ్రూప్-2 నోటిఫికేషన్ జారీపై టీఎస్పీఎస్సీ తర్జనభర్జన పడుతోంది.
ఇప్పటికే భారీగా రిజిస్ట్రేషన్
రాష్ట్రంలో డిగ్రీలు, పీజీలు పూర్తి చేసుకుని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న వారు 6.5 లక్షలకుపైగా ఉన్నారు. టీఎస్పీఎస్సీ ప్రారంభించిన వన్టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేయించుకున్న వారే 6,22,302 మంది (పదిరోజుల కిందటి వరకు) ఉన్నారు. నోటిఫికేషన్లు జారీ అయితే ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. వీరిలో గ్రూప్ పరీక్షల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నవారే 5 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అనుమతి లభించిన కొన్ని పోస్టులతోనే నోటిఫికేషన్లు జారీ చేయాలా, ప్రభుత్వం నుంచి మరిన్ని పోస్టులకు గ్రీన్సిగ్నల్ వచ్చాక అన్నింటికీ ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వాలా? అన్న గందరగోళంలో టీఎస్పీఎస్సీ ఉంది. ఇప్పుడున్న పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని, మరిన్ని పోస్టులకు అనుమతి వస్తే వాటిని సప్లిమెంటరీ నోటిఫికేషన్గా ఇస్తే ఎలా ఉంటుందని యోచిస్తోంది.
గ్రూప్ నోటిఫికేషన్లు ఇంకెప్పుడు?
Published Sat, Dec 19 2015 6:52 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
ఎప్పుడూ పనీపనీ.. మాతో ఉండవా? అని నా కుమారుడు నిలదీశాడు
గ్రీన్ డ్రెస్లో కరిష్మా కపూర్.. జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన భామ (ఫోటోలు)
రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోంది: నిర్మల్ సభలో రాహుల్
చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Beauty Tips: ఈ డివైస్ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
హ్యాట్రిక్ కొట్టిన ఆర్సీబీ.. ఆ జట్లకు హెచ్చరిక
‘బినామీలు బయటపడతారు.. అదే చంద్రబాబు భయం’
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement