'అనుమానంతోనే పరీక్షలు, ఎబోలా లేదు' | There is no such thing as Ebola, says gandhi hospital superintendent | Sakshi
Sakshi News home page

'అనుమానంతోనే పరీక్షలు, ఎబోలా లేదు'

Dec 2 2014 12:02 PM | Updated on Sep 2 2017 5:30 PM

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో కొత్త వైరస్ లక్షణాలతో ఓ వ్యక్తి చికిత్స పొందుతున్న ఘటనపై సూపరింటెండెంట్ ధైర్యవాన్ స్పందించారు

హైదరాబాద్ : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో కొత్త వైరస్ లక్షణాలతో ఓ వ్యక్తి చికిత్స పొందుతున్న ఘటనపై సూపరింటెండెంట్ ధైర్యవాన్ స్పందించారు. 'నిన్న సాయంత్రం మూడు గంటలకు గాంధీ ఆస్పత్రిలో ఓ వ్యక్తి చేరాడు. ఈనెల 21న నైజీరియా నుంచి ఆ వ్యక్తి వచ్చాడు. వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు గుర్తించాం. నైజీరియాలో ఎబోలా ప్రభావం లేదు. పేషెంట్ పేరు, ఊరు, వ్యక్తిగత వివరాలు ప్రసారం చేయొద్దు.

అనుమానంతో ఢిల్లీకి శాంపిల్స్ పంపాం. కొన్ని గంటల్లో రిపోర్టు వచ్చింది. ఆ పేషెంట్కు ఎబోలా ఉన్నట్లు నిర్ధారణ కాలేదు. కేవలం నైజీరియా నుంచి వచ్చారు కాబట్టి...అనుమానంతో పరీక్షలు చేస్తున్నాం' అని సూపరింటెండెంట్  తెలిపారు. ఎబోలా వ్యాధి పట్ల ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని ధైర్యవాన్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement