నగరంలోని బంజారాహిల్స్లో భారీ చోరీ జరిగింది.
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్లో భారీ చోరీ జరిగింది. ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంట్లో శనివారం రాత్రి చోరీ జరిగింది. దాదాపు రూ.10 లక్షల నగదును గుర్తుతెలియని దుండగులు అపహరించుకెళ్లారు. ఇంట్లో పని చేస్తున్న వారే ఈ దొంగతనం చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.