'కేసీఆర్ రెండేళ్ల పాలనపై ఆత్మ విమర్శ చేసుకోవాలి' | telangana formation day celebrations in ysr congress party central office | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ రెండేళ్ల పాలనపై ఆత్మ విమర్శ చేసుకోవాలి'

Jun 2 2016 12:03 PM | Updated on May 25 2018 9:20 PM

తన రెండేళ్ల పాలనపై ఆత్మ విమర్శ చేసుకోవాలని సీఎం కేసీఆర్ కి తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి సూచించారు.

హైదరాబాద్ : తన రెండేళ్ల పాలనపై ఆత్మ విమర్శ చేసుకోవాలని సీఎం కేసీఆర్ కి తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి సూచించారు. గురువారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గట్టు శ్రీకాంత్రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు.

ఈ సందర్భంగా గట్టు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... ఈ రెండేళ్ల కాలంలో ప్రజలకు ఏమి చేశారో తన మనస్సాక్షిని అడిగి తెలుసుకోవాలని కేసీఆర్ను ఆయన కోరారు. రెండేళ్ల పాలనపై శ్వేత పత్రం విడుదల చేయాలని కేసీఆర్ని గట్టు శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement