ఏపీ ఎన్జీవో హోం వద్ద ఉద్రిక్తత | Telangana employees protest at AP NGO Home | Sakshi
Sakshi News home page

ఏపీ ఎన్జీవో హోం వద్ద ఉద్రిక్తత

Oct 14 2015 3:21 PM | Updated on Mar 23 2019 9:03 PM

బతుకమ్మ సంబరాల నేపథ్యంలో మరోసారి ఏపీ, తెలంగాణ ఉద్యోగుల మధ్య గర్షణ వాతావరణం నెలకొంది.

బతుకమ్మ సంబరాల సాక్షిగా మరోసారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగుల మధ్య చిచ్చు రేగింది. బతుకమ్మ సంబరాలకి తమను అనుమతించటం లేదంటూ ఏపీ ఎన్జీవో హోం బయట తెలంగాణ ఉద్యోగులు బుధవారం ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో మరోసారి ఏపీ, తెలంగాణ ఉద్యోగుల మధ్య  ఘర్షణ వాతావరణం నెలకొంది.

తమను బతుకమ్మ సంబరాలకు అనుమతించడం లేదంటూ.. తెలంగాణ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది కూడా బతుకమ్మ సంబరాల సందర్భంగా ఏపీ, తెలంగాణ ఉద్యోగుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement