* పథకాలకు నిధుల కొరత అడ్డంకి కాదు
* రైతులరుణాలు నాలుగైదేళ్లలో బ్యాంకులకు చెల్లిస్తాం
* ఓ న్యూస్ చానల్తో ముఖాముఖీలో సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సుమారు రూ.75 వేల కోట్లకు పైగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెలిపారు. అందులో ప్రణాళిక వ్యయం రూ.35 వేల కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.40 వేల కోట్లు ఉంటుందన్నారు. దీనితో పాటే హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం మరో 35 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాల్సి ఉంటుందన్నారు.
కాగా, బుధవారం రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన నిర్ణయాల అమలుకు నిధుల కొరత అడ్డంకి కాబోదని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఓ న్యూస్ చానల్ మూడుగంటల పాటు నిర్వహించిన ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధరంగాలవారు అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ వివరంగా సమాధానాలిచ్చారు. రాష్ట్రంలో అపారమైన భూ, ఖనిజ సంపద, మానవ వనరులున్నాయని చెప్పారు.
భూముల క్రమబద్దీకరణ, పన్నుల పాతబకాయిల వసూళ్లు, కొత్త పరిశ్రమలు ఏర్పడితే వచ్చే ఆదాయం తదితర ఆదాయాలను సమన్వయపరిచి అదనంగా సొమ్ము సంపాదిస్తామన్నారు. లక్ష రూపాయలలోపు వ్యవసాయ రుణాల మాఫీకి రూ.19 వేల కోట్ల నిధులు అవసరమన్నారు. వాటిని నాలుగైదేళ్లలో వాయిదాపద్ధతిలో ప్రభుత్వమే వడ్డీతో బ్యాంకులకు చెల్లిస్తుందన్నారు.
బయ్యారం,ఇనుముగుట్ట,సిద్దిపేటల్లో ఉక్కుకార్మాగారాలు...
ఖమ్మం జిల్లా బయ్యారంలో రూ.30 వేల కోట్లతో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసేందుకు స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు. అందులో 10 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. కరీంనగర్ జిల్లా ఇనుముగుట్టలో రూ.10 కోట్లతో మరో ఉక్కు పరిశ్రమ, మెదక్ జిల్లా సిద్దిపేటలో రూ.15 వేల కోట్లతో ఇంకో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
ఉచిత నిర్బంధవిద్యను అమలు చేయడం తన అతిపెద్ద కల అని కేసీఆర్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రతి మండలంలోని ఓ పాఠశాలలో దీనిని అమలు చేస్తామన్నారు.ముస్లింల సామాజిక, ఆర్థిక స్థితి గతులపై అధ్యయన కమిటీ నుంచి మూడు నాలుగు నెలల్లో నివేదిక తెప్పించుకుని, 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. సామాజిక పింఛన్లు స్వాహా చేస్తున్న అనర్హులు స్వచ్ఛందంగా ముందుకు వస్తే చర్యలు తీసుకోబోమన్నారు. ప్రభుత్వ ఏరివేతలో పట్టుబడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
75 వేల కోట్లతో తెలంగాణ బడ్జెట్!
Published Fri, Jul 18 2014 2:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆదివారం రాహుల్ గాంధీ..
హోమ్ ఓటింగ్ ప్రారంభం
రాజకీయ లబ్ధి కోసమే దుష్ప్రచారం
నరేంద్ర మోదీ.. అమిత్ షా..
జిల్లాపై సీఎం రేవంత్రెడ్డి స్పష్టత ఇవ్వాలి
ఆలోచించి ఓటు వేయండి
కేటీఆర్.., హరీశ్రావు..
హెలీప్యాడ్ ఏర్పాటును పరిశీలించిన ఎమ్మెల్యే
జిల్లాల రద్దు లీకులపై సీఎం స్పందించాలి
ప్రమోషన్లు, బదిలీలు తక్షణమే చేపట్టాలి
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement