నగరంలోని గాంధీ ఆసుపత్రి నుంచి మరో స్వైన్ ఫ్లూ రోగి మంగళవారం పరారైయ్యాడు.
హైదరాబాద్: నగరంలోని గాంధీ ఆసుపత్రి నుంచి మరో స్వైన్ ఫ్లూ రోగి మంగళవారం పరారైయ్యాడు. గత రెండు రోజుల్లో గాంధీ ఆసుపత్రి నుంచి ఇద్దరు స్వైన్ ఫ్లూ రోగులు పరారైయ్యారు. దాంతో ఆసుపత్రి వైద్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత మూడు నెలల్లో 16 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. వారిలో నలుగురు మృతి చెందారు. అయితే ఇప్పటి వరకు అయిదుగురు స్వైన్ ఫ్లూ రోగులు ఆసుపత్రి నుంచి పరారైయ్యారు.