Swine flu patients
-
ఒక్కరోజే 9 స్వైన్ప్లూ కేసులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో స్వైన్ఫ్లూ మళ్లీ విజృంభిస్తోంది. సోమవారం ఒక్కరోజే 9 కేసులు నమోదయ్యాయి. జూబ్లీహిల్స్, హైదర్గూడల్లోని అపోలో, సోమాజిగూడ యశోద, స్టార్, కిమ్స్, హోప్ చిల్డ్రన్స్ ఆస్పత్రుల్లో స్వైన్ఫ్లూ రోగులు చికిత్స పొందుతున్నారు. వీరిలో రెండేళ్ల బాలిక, ఆరు మాసాల శిశువు కూడా ఉన్నారు. స్వైన్ఫ్లూ లక్షణాలున్న మరో ముగ్గురు ఉస్మానియాలో చేరారు. -
గాంధీ నుంచి మరో స్వైన్ ఫ్లూ రోగి పరారీ
హైదరాబాద్: నగరంలోని గాంధీ ఆసుపత్రి నుంచి మరో స్వైన్ ఫ్లూ రోగి మంగళవారం పరారైయ్యాడు. గత రెండు రోజుల్లో గాంధీ ఆసుపత్రి నుంచి ఇద్దరు స్వైన్ ఫ్లూ రోగులు పరారైయ్యారు. దాంతో ఆసుపత్రి వైద్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత మూడు నెలల్లో 16 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. వారిలో నలుగురు మృతి చెందారు. అయితే ఇప్పటి వరకు అయిదుగురు స్వైన్ ఫ్లూ రోగులు ఆసుపత్రి నుంచి పరారైయ్యారు.