‘గురుకుల’ సొసైటీ విభజనకు చర్యలు | Society division of boarding schools | Sakshi
Sakshi News home page

‘గురుకుల’ సొసైటీ విభజనకు చర్యలు

May 31 2014 1:15 AM | Updated on Sep 2 2017 8:05 AM

ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సొసైటీ విభజనకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు మాధ్యమిక విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ జీవో జారీచేశారు.

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సొసైటీ విభజనకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు మాధ్యమిక విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ జీవో జారీచేశారు. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సొసైటీ, తెలంగాణ గురుకుల విద్యాలయాల సొసైటీ ఏర్పాటు కానున్నాయి. కాగా, నకిలీ మెడికల్ బిల్లులు పెట్టి నిధులు స్వాహా చేసిన దాదాపు వందమంది టీచర్లపై చర్యలు చేపట్టేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ఆ కేసులు నడుస్తుండగానే కొత్తగా మరో వంద మందిపై చర్యలు చేపట్టింది. ఒక్కొక్కరు రూ.లక్ష నుంచి రూ. 2లక్షల వరకు కాజేసినట్లు తేలింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement