‘సరోజినీ’ బాధితులు డిశ్చార్జి | "Sarojini" victims discharged | Sakshi
Sakshi News home page

‘సరోజినీ’ బాధితులు డిశ్చార్జి

Jul 13 2016 12:45 AM | Updated on Sep 4 2017 4:42 AM

‘సరోజినీ’ బాధితులు డిశ్చార్జి

‘సరోజినీ’ బాధితులు డిశ్చార్జి

సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో శస్త్రచికిత్సలతో చూపు కోల్పోయిన పేషెంట్లను మంగళవారం డిశ్చార్జ్ చేశారు.

హైదరాబాద్ : సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో శస్త్రచికిత్సలతో చూపు కోల్పోయిన పేషెంట్లను మంగళవారం డిశ్చార్జ్ చేశారు. ఇక చూపు రాదని నిర్ధారించుకున్న రోగులు... ఇంటికి పోతామని చెప్పడంతో ఆస్పత్రి వైద్యులు వారిని ఇంటికి పంపించారు. డిశ్చార్జి అయినవారిలో నూకాలతల్లి, అర్పనీబాయి, ప్రభావతి, అంజిరెడ్డి ఉన్నారు. దీంతో ఒక్కరు మినహా అంతా డిశ్చార్జి అయ్యారు. మాణిక్యం చికిత్స పొందుతున్నారు. నూకాలతల్లిని రెండు రోజులకోమారు వైద్య పరీక్షల కోసం రావాలని సూచించారు.

ఆమెకు త్వరలో మరో ఆపరేషన్ చేసి చూపు తెప్పించే అవకాశం ఉందన్నారు. అంజిరెడ్డి, అర్పనీబాయి, ప్రభావతిలకు కూడా చూపు రప్పించేందుకు వైద్య బృందం కృషి చేస్తోందని ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ రాజేశ్ గుప్తా తెలిపారు. గత నెల 30న కంటి సమస్యల తో బాధపడుతున్న 21 మందికి సరోజినీదేవి ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు చేశారు. శస్త్రచికిత్సలు వికటించి వీరిలో 12 మంది చూపు కోల్పోయారు. ఇద్దరికి నేత్రదానం ద్వారా వైద్యులు చూపు తెప్పించారు.
 
 ఇంకా కళ్లు కనపడడం లేదు: నూకాలతల్లి

 ఎన్ని ఆపరేషన్లు చేసినా కళ్లు మాత్రం కనబడడం లేదు. ఆస్పత్రిలో ఉండలేకపోతున్నాం. కళ్లు వస్తాయనే నమ్మకం లేక బేజారై ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఇంటి వద్ద అన్నం పెట్టే వారు కూడా లేరు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.
 
 ఏ పనీ చేసుకోలేని దుస్థితి: అంజిరెడ్డి
 ఉచితంగా కంటి చూపు మెరుగు చేస్తారని ఆస్ప త్రికి వస్తే ఉన్న చూపు కాస్తా పోయింది. 2 వారాలు న్నా కళ్లు కనిపించడం లేదు. దీంతో నడవడం కూడా కష్టమవుతోంది. ఇంటికెలా వెళ్లాలో కూడా అర్థం కావడం లేదు. వెళ్లినా ఏ పనీ చేసుకోలేని దుస్థితి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement