'6 నెలల్లోనే విద్యుత్‌ సమస్యను పరిష్కరించాం'

'6 నెలల్లోనే విద్యుత్‌ సమస్యను పరిష్కరించాం' - Sakshi


హైదరాబాద్‌: ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమావేశంలో సోమవారం తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 6 నెలల్లోనే విద్యుత్‌ సరఫరా సమస్యను పరిష్కరించామని గుర్తుచేశారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని అన్నారు.



నీటి సరఫరా విషయంలో కూడా తాము ముందడుగు వేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌ నగరంలో రద్దీకి అనుగుణంగా రహదారుల నిర్మాణం చేపడుతామని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top