హైదరాబాద్ : భాగ్యనగరంలో రోడ్లు ప్రజల ప్రాణాలకు ముప్పును తెచ్చిపెడుతున్నాయి. బేగంపేటలో చంద్రబాబు, జ్యోతి అనే దంపతులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. తమ రెండేళ్ల కుమారుడితో కలిసి స్కూటీపై వస్తుండగా బేగంపేట లైఫ్ స్టైల్ సమీపంలో రోడ్డుపై ఉన్న గుంత కారణంగా పడిపోయారు.
గాయపడ్డ వారు... జీహెచ్ఎంసీ అధికారుల తీరును నిరసిస్తూ దంపతులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ జాం అయ్యింది. ఇది గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్స్టేషన్కు తరలించారు. రాత్రాంతా వారిని పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఈ క్రమంలో పోలీసులు, దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. గత రాత్రి ఈ సంఘటన జరిగింది.
ఈ విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు పంజాగుట్ట పీఎస్కు వెళ్లగా.... చందూ తాగి, పోలీసులతో ఘర్షణ పడినందుకే తాము అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ వెంకటేశ్వరరావు వివరణ ఇచ్చారు. తమను అన్యాయంగా పోలీసులు కొట్టారని బాధితురాలు జ్యోతి కన్నీటిపర్యంతమైంది. తాము పబ్కో మరెక్కడకో వెళ్లిలేదని... బల్కంపేటలో ఉయ్యాల ఫంక్షన్కు వెళ్లి వస్తున్నామని జ్యోతి తెలిపారు.
పడిపోయిన తమను...ఏం జరిగిందో అడగకుండానే కానిస్టేబుల్ రావటం ...రావటమే దాడి చేశాడని ఆమె పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్కు తీసుకు వచ్చిన తర్వాత కూడా తన భర్తను పోలీసులు విచక్షణారహితంగా కొట్టారని, అడ్డు వెళ్లిన తనపై కూడా ప్రతాపం చూపారని జ్యోతి కన్నీటిపర్యంతమయ్యారు. బాధలో తన భర్త ...పొరపాటును మాట జారి ఉండవచ్చని...దానికి పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరించటం బాధాకరమన్నారు. గతంలోనూ ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయని, అప్పుడు కూడా పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించేవారని పలువురు విమర్శిస్తున్నారు.
దంపతులపై పోలీసుల దాడి, పబ్కి వెళ్లలేదు...
Published Sat, Dec 27 2014 9:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement