సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్కు పదును
సాక్షి,హైదరాబాద్: సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా జరపాలన్న డిమాండ్పై రాష్ట్ర బీజేపీ దూకుడును మరింతగా పెంచుతోంది. హైదరాబాద్ స్టేట్ విమోచన ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్తో కొంత కాలంగా బీజేపీ వివిధరూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ రోజు సమీపిస్తుండడంతో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల స్వరాన్ని, సవాళ్ల పర్వాన్ని ఒక్కసారిగా పెంచింది. తిరంగా యాత్ర పేరుతో ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది.
గతంలో టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ఉన్నపుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలని డిమాండ్ చేసి, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ మాట మరువడాన్ని ప్రజల్లో ఎత్తిచూపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. రాజకీయంగా కూడా పార్టీ రాష్ట్రంలో బలపడేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందనే నమ్మకంతో బీజేపీ నాయకత్వం ఉంది. సెప్టెంబర్ 17న వరంగ ల్లో నిర్వహించనున్న బహిరంగసభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా పాల్గొంటారు.
ప్రభుత్వమే టార్గెట్గా కార్యక్రమాలు...
హైదరాబాద్ విమోచన ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్ ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టి, సర్కారు వైఫల్యాలను ఎండగట్టాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా రాష్ర్టవ్యాప్తంగా, ము ఖ్యంగా నిజాంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం జరిగిన ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలను చేపడుతోంది. 1948 సెప్టెంబర్ 17న జరిగింది విలీనమా, విమోచనమా, విద్రోహమా అన్న దానితో సంబంధం లేకుండా ఈ ఉత్సవాలను ప్రభుత్వమే నిర్వహించాలని బీజేపీ అంటోంది. నిజాం వ్యతిరేక పోరాటంలో ప్రాధాన్యతను సంతరించుకున్న ప్రాంతాలు, చరిత్రలో స్థానం సంపాదించుకున్న ఘటనలు, వ్యక్తులను గుర్తుచేసుకునేలా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాల గురించి పార్టీపరంగా ప్రచారం చేసేందుకు మహిళా మోర్చా, మైనారిటీ మోర్చా, ఎస్సీ, ఎస్టీ, యువజన మోర్చాలను రంగంలోకి దింపింది.
‘విమోచన’పై దూకుడు పెంచిన బీజేపీ
Published Wed, Sep 14 2016 1:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement