తెలంగాణ సీఎం క్యాంప్ కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం కలకలం సృష్టించింది.
హైదరాబాద్ : తెలంగాణ సీఎం క్యాంప్ కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం కలకలం సృష్టించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసేందుకు అనుమతి ఇవ్వటం లేదంటూ నాచారానికి చెందిన రాజు...ఈరోజు ఉదయం క్యాంప్ ఆఫీస్ వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకునేందుకు ప్రయత్నించాడు.
ఈ విషయాన్ని గమనించిన పోలీసులు అతడిని అడ్డుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. తనను ఉద్యోగం నుంచి అన్యాయంగా తొలగించారని, సీఎంకు విన్నవించుకునేందుకు వస్తే అనుమతి ఇవ్వకపోవటంతోనే ఆత్మహత్యాయత్నం చేసినట్లు రాజు తెలిపాడు.