రాష్ట్ర చేపగా కొరమీను | Koramanu fish diclared as Telangana state fish | Sakshi
Sakshi News home page

రాష్ట్ర చేపగా కొరమీను

Jul 21 2016 5:24 AM | Updated on Aug 11 2018 4:59 PM

రాష్ట్ర చేపగా కొరమీను - Sakshi

రాష్ట్ర చేపగా కొరమీను

‘కొరమీను’ను రాష్ట్ర చేపగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
 సాక్షి, హైదరాబాద్: ‘కొరమీను’ను రాష్ట్ర చేపగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అధికారిక చేపగా కొరమీనుకు గుర్తింపునిచ్చింది. దీన్నే మరేల్ లేదా మురేల్ ఫిష్‌గా పిలుస్తారు. మత్స్యశాఖ పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం కొరమీనును అధికారిక చేపగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొరమీను శాస్త్రీయ నామం చన్నా స్ట్రయేటస్.  ప్రతి రాష్ట్రానికి ఆ రాష్ట్ర చేపగా ఒక రకాన్ని గుర్తిస్తారు.
 
 అలా గుర్తించిన చేపలను కాపాడుకోవడమే కాకుండా వాటి సంతతి అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. ఆ చేప జన్యువును లక్నోలోని నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్‌లో భద్రపరుస్తారు. రాష్ట్రంలో లభించే వివిధ రకాల చేపల్లో కొరమీనుకు అత్యంత ప్రాధాన్యముంది. చేపల పులుసులో కొరమీను రుచికి మించింది లేదు. అందుకే పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా ఈ చేపలకు డిమాండ్ ఎక్కువ. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో రేటు కూడా ఎక్కువే. రాష్ట్రంలో మత్స్యకారులకు లాభాల పంట పండించే చేపగా కొరమీను అందరికీ సుపరిచితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement