రాళ్లబండి కవితాప్రసాద్కు 25వేలు జరిమానా | Information Commissioner issues fines Rallabandi Kavitha Prasad | Sakshi
Sakshi News home page

రాళ్లబండి కవితాప్రసాద్కు 25వేలు జరిమానా

May 15 2014 4:59 PM | Updated on Oct 2 2018 4:31 PM

రాళ్లబండి కవితాప్రసాద్కు 25వేలు జరిమానా - Sakshi

రాళ్లబండి కవితాప్రసాద్కు 25వేలు జరిమానా

రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రాళ్లబండి కవితాప్రసాద్కు సమాచార హక్కు కమిషన్ రూ.25వేలు జరిమానా విధించింది.

హైదరాబాద్ : రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రాళ్లబండి కవితాప్రసాద్కు సమాచార హక్కు కమిషన్ రూ.25వేలు జరిమానా విధించింది. తెలుగు మహాసభల ఖర్చుకు సంబంధించి ఇంతవరకూ ఆయన వివరాలు సమర్పించలేదని సమాచారం. అంతే కాకుండా ఆడిట్ విషయంలో  అడిగిన సమాచారం సకాలంలో అందించకపోవటంతో పాటు, తప్పుడు సమాచారాం ఇచ్చారంటూ సమాచార హక్కు కమిషనర్ విజయబాబు జరిమానా విధించారు. కోట్లాది రూపాయల  అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదుల నేపథ్యంలో దీనిపై విచారణ జరిపించాలని సమాచార హక్కు కమిషన్.... ప్రభుత్వాన్ని కోరింది.

ఇదిలా ఉండగా, ఎటువంటి విచారణకైనా తాను సిద్దమేనని రాళ్లబండి కవితాప్రసాద్ చెప్పారు. రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ తెలుగు మహాసభలు, రవీంద్ర భారతి హాలు కేటాయింపునకు సంబంధించి అడిగిన వివరాలను సమర్పించినట్లు ఆయన తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement