వారసత్వం ఉట్టిపడింది! | Heritage come! | Sakshi
Sakshi News home page

వారసత్వం ఉట్టిపడింది!

Jan 27 2017 12:30 AM | Updated on Sep 5 2017 2:11 AM

వారసత్వం  ఉట్టిపడింది!

వారసత్వం ఉట్టిపడింది!

వింటేజ్‌ కార్‌ అండ్‌ మోటార్‌ బైక్‌ల షో సందర్శకులను ఎంతో ఆకట్టుకుంది.

వింటేజ్‌ కార్‌ అండ్‌ మోటార్‌ బైక్‌ల షో సందర్శకులను ఎంతో ఆకట్టుకుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దక్కన్‌ హెరిటేజ్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో గురువారం లుంబినీ పార్క్‌లో ఈప్రదర్శన నిర్వహించారు. 1952వ సంవత్సరం మోడల్‌ మొదలుకొని షెవర్లే, ఆస్టిన్, ఫోర్డ్‌ కంపెనీల కార్లతో పాటు రాయల్‌ ఎన్‌ఫీల్డ్, రాజ్‌దూత్, వెస్పా స్కూటర్లు షోలో ఉంచారు.

ఈసందర్భంగా ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ట్రాఫిక్‌అదనపు కమిషనర్‌ జితేందర్‌ ముఖ్యఅతిథిగా విచ్చేసి వింటేజ్‌ కార్లను, బైక్‌లను పరిశీలించారు. షో ముగిశాక ఏర్పాటు చేసిన బైక్‌ ర్యాలీ ఆకట్టుకుంది.           – ఖైరతాబాద్‌

Advertisement
 
Advertisement
Advertisement