‘మన్ కీ బాత్‌’లో ప్రధాని మోదీ గణతంత్ర సందేశం | Republic Day at Core of PM Modis Mann Ki Baat Message | Sakshi
Sakshi News home page

‘మన్ కీ బాత్‌’లో ప్రధాని మోదీ గణతంత్ర సందేశం

Jan 25 2026 1:22 PM | Updated on Jan 25 2026 1:33 PM

Republic Day at Core of PM Modis Mann Ki Baat Message

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (ఆదివారం) తన రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 130వ ఎపిసోడ్‌లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన గణతంత్ర దినోత్సవం, భారత రాజ్యాంగం, ఎన్నికల ప్రక్రియల మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని వివరించారు. జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిందనే విషయాన్ని గుర్తుచేస్తూ, ఆ రోజు రాజ్యాంగ నిర్మాతల త్యాగాలను స్మరించుకునేందుకు ఒక గొప్ప అవకాశమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

జనవరి 25న జరుపుకునే ‘జాతీయ ఓటర్ల దినోత్సవం’ ప్రాముఖ్యతను వివరిస్తూ, భారత ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటరు కీలక పాత్ర పోషిస్తారని, ఓటరే ప్రజాస్వామ్యానికి ఆత్మ వంటివారని మోదీ అభివర్ణించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వేయడం కేవలం ఒక హక్కు మాత్రమే కాదని, అది ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రధాని చెప్పారు. ముఖ్యంగా యువతను ఉద్దేశించి మాట్లాడుతూ ఎవరైనా యువతీయువకులు మొదటిసారి ఓటు వేస్తున్నప్పుడు, వారు ఇరుగుపొరుగు వారితో కలసి స్వీట్లు పంచుకోవాలని పిలుపునిచ్చారు. 2016 జనవరిలో యువత కోసం ‘స్టార్టప్ ఇండియా’ ప్రయాణాన్ని ప్రారంభించినట్లు ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు.

నాడు చిన్నదిగా మొదలైన ఆ ప్రయత్నం, నేడు భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా తీర్చిదిద్దిందని ప్రధాని పేర్కొన్నారు. 
ఏఐ (ఏఐ), అంతరిక్షం, అణుశక్తి, సెమీకండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్, బయోటెక్నాలజీ తదితర అత్యాధునిక రంగాల్లో భారతీయ స్టార్టప్‌లు సత్తా చాటుతున్నాయని  అన్నారు. ఈ ప్రగతిలో యువత ఎంపికలు, ఆవిష్కరణలే కీలకమని పేర్కొన్నారు. భారతీయ ఉత్పత్తులంటేనే ‘అత్యుత్తమ నాణ్యత’ అనే గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. దేశంలోని యువ పారిశ్రామికవేత్తలు,  ఆవిష్కర్తలకు సెల్యూట్ చేస్తూ, నవకల్పనలతో పాటు బలమైన ప్రజాస్వామ్య భాగస్వామ్యం వైపు అడుగులు వేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: ప్రాణం తీసిన పని ఒత్తిడి.. టెక్కీ దుస్థితి వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement