సర్వశ్రేయోనిధికి రూ.50 కోట్ల గ్రాంటు | Endowments Department budget Rs.50 crore grants | Sakshi
Sakshi News home page

సర్వశ్రేయోనిధికి రూ.50 కోట్ల గ్రాంటు

Mar 15 2016 3:10 AM | Updated on Sep 3 2017 7:44 PM

దేవాదాయ శాఖ సర్వశ్రేయోనిధికి ప్రభుత్వం రూ.50 కోట్లు గ్రాంటుగా ప్రకటించింది. పురాతన దేవాలయాల జీర్ణోద్ధరణ, కొత్త ఆలయాలను...

సాక్షి, హైదరాబాద్: దేవాదాయ శాఖ సర్వశ్రేయోనిధికి ప్రభుత్వం రూ.50 కోట్లు గ్రాంటుగా ప్రకటించింది. పురాతన దేవాలయాల జీర్ణోద్ధరణ, కొత్త ఆలయాలను ధూపదీప నైవేద్యాల పథకం కిందకు తేవటం, బలహీన వర్గాల కాలనీల్లో రామాలయాల నిర్మాణం కోసం ఈ నిధులు వినియోగిస్తారు. బలహీన వర్గాల వాడల్లో రామాలయాల నిర్మాణ పనులకు సంబంధించి దాదాపు రూ.43 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో కనీసం రూ.100 కోట్లు కావాలంటూ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇటీవల  సీఎంను కోరారు. ఇక యువజన వ్యవహారాలు, పర్యాటక, సాంస్కృతిక శాఖకు రూ.232 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సాంస్కృతిక సారథికి రూ.25 కోట్లు అడగ్గా.. రూ.15 కోట్లు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement