సుమారు రూ.10 కోట్లు కాజేసిన దంపతులు
బంజారాహిల్స్: లక్ష రూపాయలు ఇవ్వండి... నెలకు 10 శాతం కమీషన్ ఇస్తాం.. కావాలంటే మీ డబ్బు మధ్యలోనే వాపస్ తీసుకోవచ్చు.. ఇలా మాయమాటలు చెప్పి.. అమాయకుల నుంచి పెట్టుబడి పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్న కేటుగాడిని బంజారాహిల్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... ఒంగోలు నగరం బండ్లమిట్టకు చెందిన కానుగుల శ్రీనివాసరావు, సురేఖ దంపతులు గతకొంత కాలంగా జూబ్లీహిల్స్ రోడ్ నెం.71లోని నవ నిర్మాణ్నగర్లో ఓ ఖరీదైన ఫ్లాట్ను అద్దెకు తీసుకొని గ్రీన్వాల్ట్ గ్లోబల్ పేరుతో కార్యాలయం తెరిచారు.
తమ సంస్థ ప్రధాన కార్యాలయం న్యూజిలాండ్లో ఉందని, ఆంధ్రప్రదేశ్ శాఖకు తాను మేనేజర్నని శ్రీనివాసరావు స్థానికులను నమ్మించాడు. తమ సంస్థలో పెట్టుబడి పెడితే నెలకు 10 శాతం కమీషన్లు ఇస్తామని చెప్పి లక్షలాది రూపాయలు తీసుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 14లో నివాసం ఉండే ఎస్కే మస్తాన్ కమీషన్కు ఆశ పడి తనతో పాటు బంధువులు, మిత్రులతో రూ. 53 లక్షలు కట్టించాడు. మూడు నెలల పాటు సక్రమంగానే కమీషన్లు ఇచ్చిన శ్రీనివాసరావు ఆ తర్వాత ముఖం చాటేశాడు. గట్టిగా అడిగేసరికి 2014 ఆగస్టు 3వ తేదీ రాత్రి బిచాణా ఎత్తేశాడు. బాధితులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలో దిగిన పోలీసులు నిందితుడు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకోగా.. భార్య సురేఖ పరారీలో ఉంది.
నిందితుడిపై ఐపీసీ సెక్షన్లు 420, 506 కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కాగా, వీరి చేతిలో మోసపోయిన బాధితుల సంఖ్య భారీగానే ఉండవచ్చని పోలీసులకు అందిన ఫిర్యాదులు ద్వారా తెలుస్తోంది. కూకట్పల్లికి చెందిన ఎం.మురళీకృష్ణ, చిక్కడపల్లికి చెందిన ఆదిత్య మోహన్, మెహిదీపట్నంకు చెందిన సూర్యప్రకాశ్, సురేందర్రాజు, శ్రీనివాస్, శంకర్ తదితరులు కూడా ‘గ్రీన్వాల్ట్ గ్లోబల్’లో భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టి మోసపోయామని ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. నిందితుడు సుమారుగా 150 మంది నుంచి రూ. 10 కోట్ల వరకు వసూలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
కమీషన్ పేరుతో దగా
Published Tue, Apr 21 2015 1:16 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో రెండు రోజులు వానలు
గుడ్ మార్నింగ్.. ఏలూరు
13,103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్
పోలింగ్ నిర్వహణకు పటిష్ట ప్రణాళిక
వైఎస్సార్సీపీ అభ్యర్థుల ప్రచార జోరు
కబ్జాపర్వం.. దందాలే సర్వం
పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
జగనన్న ఇచ్చిన వరం సొంతిల్లు
మద్యం దుకాణం సిబ్బందిపై కేసు నమోదు
అల్లూరితో మన్యంలో విప్లవ చైతన్యం
తప్పక చదవండి
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
Advertisement