-
మహిళను ముంచిన ‘మ్యాట్రిమోని’ ప్రేమ!
హైదరాబాద్: మ్యాట్రిమోని సైట్లో పరిచయం చేసుకొని నగరానికి చెందిన ఓ మహిళను సైబర్ చీటర్స్ మోసం చేశారు. నగర సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం... ఓ మహిళ వివాహం కోసం మ్యాట్రిమోని సైట్లో రిజిస్టార్ చేసుకుంది. ఈ సైట్ ద్వారా ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇద్దరూ కలిసి కొద్ది రోజులు చాట్ చేసుకున్నారు. తనను ప్రేమిస్తున్నానని నమ్మించాడు. తాను అమెరికాలో ఉన్నత స్థాయిలో పనిచేసే వ్యక్తినని, అమెరికా నుంచి ఇండియా వచ్చాక పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కొద్దిరోజుల తర్వాత ఇండియాలో ఉన్న తమ బంధువులకు సీరియస్గా ఉందని, వైద్యం చేయించాలని చెప్పి ఆ ఖర్చులకు గాను డబ్బులు కావాలని అడిగాడు. తాను ఇండియా వచ్చాక మొత్తం డబ్బులు తిరిగి ఇస్తానని, తర్వాత పెళ్లి కూడా చేసుకుందామని నమ్మించాడు. దీంతో ఆ మహిళ విడతల వారిగా రూ. 30 లక్షలు చీటర్స్ చేప్పిన విధంగా ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసింది. అనంతరం ఆ వ్యక్తి స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన మహిళ మోసపోయానని నగర సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ శివమారుతి తెలిపారు. ఈ తరహా మ్యాట్రిమోని మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వారితో ఆన్లైన్లో ప్రేమ, పెళ్లి అని చెబితే నమ్మవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. -
రామోజీ – బాబోజీ అండ్ కో...
షాపూర్జీ – పల్లోంజీ అనేది దేశంలో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ గ్రూప్. ఇలా జంటశ్రీల పేర్లతో జాయింట్ వ్యాపార సంస్థలు దేశంలో చాలా ఉన్నాయి. వీటన్నింటిలోకీ అత్యంత సృజనాత్మక మైన గ్రూప్ రామోజీ – బాబోజీ గ్రూప్! వారు తెలుగువారు కావడం తెలుగు వారందరూ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవలసిన విషయం. అందరికీ మల్లేనే వీరికీ విడివిడిగా సంప్రదాయ వ్యాపారాలున్నాయి. పచ్చళ్లూ, పాలు, పెరుగు, పూటకూళ్ల హోటళ్లు, పత్రికలూ వగైరా! వేరువేరుగా ఇన్ని వ్యాపార పీస్లున్నప్పటికీ వారు మాత్రం నాట్ హ్యాపీస్! బొంబాయి మాఫియా మీద వచ్చిన అన్ని సినిమాల్లోనూ ‘వుడ్ బీ డాన్’లు కామన్గా చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది. ‘నేను బొంబాయిలో బతకడానికి రాలేదు, బొంబాయిని ఏలడానికి వచ్చాన’ని! రామోజీ, బాబోజీ హృదయాల్లో కూడా ఇటువంటి కోరికలే ఆరని అగ్నిజ్వాలలై భగభగ మండుతూ ఉండేవని వారి బయోగ్రఫీని తిరగేస్తే మనకు అర్థమవుతుంది. నువ్వాదరినీ, నేనీదరినీ అన్నట్టుగా వేరువేరు చోట్ల మండుతున్న ఈ రెండు కంచు కాగడాలను విధియాడిన వింత నాటకం ఒక చోటకు చేర్చింది. ఇంకేముంది! ప్రళయం రానే వచ్చింది. ఆకాశంలోని పక్షు లన్నీ భయంతో అరుస్తూ రెక్కలు అల్లాడిస్తూ నేలకు రాలి పడ్డాయి. అచ్చం అలాగే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చిన్నచిన్న చిట్ఫండ్ కంపెనీలన్నీ రాలిపడ్డాయి. సూర్యుడు భగభగ మండుతూ అగ్నిగోళంలా దర్శనమిస్తాడు. ఫలితంగా భూమ్మీద ప్రజాస్వామ్యంలో దొంగలు పడ్డారు. చంద్రుడు బాబోజీ అనే అర్భకుడు రామోజీ సహకారంతో వెన్నుపోటు విద్యను ఉపయో గించుకొని దొడ్డిదారిన రాజ్యాధికారం చేపట్టాడు. చరిత్ర ఎరుగని వింతలు – విడ్డూరాలు ఒకదాని వెంట మరొకటి తరుముకుంటూ పరిణమించాయి. బిజినెస్ మ్యాన్ బాబోజీ అలియాస్ పొలిటికల్ చంద్ర బాబుకు సంబంధించిన రాజకీయ ప్రస్థానం తెలుగు ్రçపజలకు చర్వితచర్వణమే. అతనిలోని నివురుగప్పిన బిజినెస్ నిప్పును రాజేయగల పెట్టుబడికి స్వయంగా స్థోమత లేదు. రెండెకరాల పేద రైతు కుటుంబం. అందుకని రాజకీయ రూట్లో నరుక్కు రావాలని సంకల్పించారు. ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. ఇందిరా కాంగ్రెస్ టిక్కెట్ కావాలనే పేరున్న నాయకుడు ఎవరూ మిగల్లేదు. ఏదో ఒక పార్టీ టిక్కెట్ పాలి టిక్స్కు పాస్పోర్టుగా పనికొస్తుందని చంద్రబాబు చంద్రగిరి నుంచి దరఖాస్తు చేసుకున్నారు. జాక్పాట్ తగిలినట్లయింది. ఇందిరమ్మ ప్రభంజనం రాష్ట్రాన్ని కమ్మేసింది. అనూహ్యంగా చంద్రబాబు ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి అంజయ్యను ప్రసన్నం చేసుకోగలిగారు. మంత్రిపదవి లభించింది. బిజినెస్ మ్యాన్కు పెట్టుబడి దొరికింది. పెళ్లికాని యువకుడు, తమ సామాజికవర్గం వాడు మంత్రిపదవిలో ఉండడంతో ఎన్టీఆర్ తన కూతురిని ఇచ్చి పెళ్లి చేశారు. బిజినెస్ మొదలైంది. తొలిమెట్టుగా తిరుపతి పుణ్యక్షేత్రంలోనే సొంత స్నేహితుల్ని మోసం చేసి ఒక హోటల్ను సొంతం చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇటువంటి మోసపు మెట్లనే ఒక్కొ క్కటిగా పేర్చుకుంటూ హెరిటేజ్ భవంతిని నిర్మించుకున్నారు. హెరిటేజ్ వ్యవహారంలో బాబు తనను మోసం చేశాడని మోహన్బాబు వంటి సెలబ్రిటీయే వాపోయిన సంగతి తెలిసిందే. కాలక్రమంలో చంద్రబాబుకు రామోజీతో ఒక సహకార ఒప్పందం కుదిరింది. ‘నీకిది – నాకది’ అనే సూత్రంపై కుదిరిన సహకార ఒప్పందం ఫలితంగా బాబు ముఖ్యమంత్రి అయ్యారు. రాజకీయం ఆయన బిజినెస్గా మారింది. బిజినెస్లు బినామీ పేర్లతో ఖండాంతరాల్లో ప్రవర్ధమానమవుతున్నాయన్న వార్తలు వచ్చాయి. అడ్డగోలుగా సంపాదించాలనుకునే చాలామందికి రామోజీ కథ చాలా ఉత్తేజభరితమైనది. అనుసరించిన మార్గం ఏదయితే నేమి ఆయనొక వ్యాపార మహాసామ్రాజ్యాన్ని నిర్మించగలిగారని ఈ బ్యాచ్వారు కీర్తిస్తుంటారు. ఆరంభంలో చేరదీసిన జేజే రెడ్డి అనే శ్రేయోభిలాషికి రామోజీ శఠగోపం పెట్టారనే ఆరోపణలు వచ్చాయి. ఆ తరువాతనే ఆయన ప్రస్థానం వేగం పుంజు కున్నదట! ‘ఈనాడు’ పత్రిక కోసం విశాఖలో స్థలాన్ని అద్దెకు ఇచ్చిన రాజుగారిని మానసిక హింసకు గురిచేశారు. అదే రాజుగారు హైదరాబాద్ స్థలాన్ని కూడా లీజుకిచ్చారు. అక్కడ కూడా ఆయనకు చుక్కల్ని చూపించారట! విజయవాడ స్థలాన్ని చ్చిన సొంత తోడల్లుడు కూడా తర్వాత ఘొల్లుమనడం అందరికీ తెలిసిన విషయమే! ‘ఒకటా రెండా? ఎన్నని చెప్పను మా బాబాయి లీలలు’ అంటూ రామోజీ సోదరుని కుమారుడు చంద్రమౌళి ఏకంగా ఒక పుస్తకాన్నే రచించి జనంలోకి వదిలారు. మూడు మోసాలు – ఆరు వంచనలతో ఇలా సాగుతున్న రామోజీ వ్యాపార ప్రస్థానం చంద్రబాబుతో కుదిరిన సహకార ఒప్పందం తర్వాత మరో మలుపు తిరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థ మూడు ప్రధానాంగాలపై ఆధారపడి పనిచేస్తుంది. శాసన, కార్యనిర్వాహక, న్యాయ విభాగాలు ఈ ప్రధానాంగాలు. వాటితోపాటు ఆరోగ్యకరమైన మీడియా కూడా ప్రజాస్వామ్య పరిపుష్టికి దోహదం చేస్తుందన్న విశ్వాసంతో దాన్ని ‘ఫోర్త్ ఎస్టేట్’గా పిలిచి గౌరవించారు. అధికారంలో ఉన్నప్పుడు శాసన, కార్యనిర్వాహక విభాగాలను వారి వ్యాపార ప్రయోజ నాలకే వాడుకున్నారు. వారి ప్రయోజనాలనే లోకకల్యాణంగా ప్రచారం చేసుకోవడానికి ఫోర్త్ ఎస్టేట్ మీద వారు సాధించిన ఆధిపత్యం తోడ్పడింది. లిటిగెంట్ వ్యూహాలతో, నాట్ బిఫోర్, బెంచ్ హంటింగ్ వంటి ఎత్తుగడలతో అనుకూల తీర్పులు వచ్చేలా చేసుకోవడంలో ప్రావీణ్యం సాధించారు. ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజల చేతిలో ఉండ వలసిన రాజదండాన్నీ ఈ ముఠా చేజిక్కించుకున్నది. వ్యవస్థల మీద పట్టుతో, మ్యానిపులేషన్లతో సకల వనరుల మీద కూడా వ్యాపార భాగస్వాములు అదుపు సాధించారు. చెరువుల్ని, గుట్టల్ని, రహదారుల్ని యథేచ్ఛగా ఆక్రమించి, చట్టాన్ని చట్టుబండగా మార్చి రామోజీ ఫిలింసిటీ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. చట్టవిరుద్ధంగా వేలకోట్ల రూపాయలు డిపాజిట్లుగా సేకరించి సొంత వ్యాపారాలకు మదుపు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పునాది వేసిన ఐటీ టవర్స్ విషయాన్ని మూడేళ్లపాటు తొక్కిపెట్టి తమ బినామీలు, ముఠా సభ్యులతో దానిచుట్టూ రియల్ ఎస్టేట్ బేరాలు చేసిన అనంతరమే నిర్మాణాన్ని ప్రకటించారు. ఈ వ్యవహారంతో వేల కోట్ల రూపాయల లాభాన్ని వీరి ముఠా కళ్లచూడగలిగింది. మాదాపూర్ ఐటీ ప్రాంతంలో జరిగిన వ్యాపారాన్ని సూక్ష్మరూపంగా భావిస్తే అమరావతి రాజధాని ప్రాంతం విశ్వరూపంగా పేర్కొనవచ్చు. ఈ ముఠా వేల కోట్లలో ఇక్కడ పెట్టుబడి పెట్టి ఉండవచ్చని అంచనాలున్నాయి. లక్షల కోట్లలో లాభాలు పిండుకోవాలని తహతహలాడారు. ఎన్నికల్లో చంద్రబాబు ఓటమితో కథ అడ్డం తిరిగింది. ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ భిన్నమైన పాలనా విధానాన్ని ఎంచుకోవడం ఈ వ్యాపార ముఠాకు మింగుడు పడలేదు. జగన్ ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ మార్గాన్ని ఎంచుకున్నది. అధికార యంత్రాంగం ప్రజలకు చేరువగా వెళ్లడం వలన పారదర్శకత పెరుగుతుందనీ, తద్వారా అవినీతికి అవకాశం చిక్కదనీ ఈ ప్రభుత్వ ఆలోచన. దీనికితోడు టెక్నాలజీ వినియోగం ద్వారా ఒక్క పైసా వృథా కాకుండా నేరుగా లబ్ధిదారులకు చేర్చేవిధంగా కార్యక్రమాలను తయారు చేసుకున్నది. మరోపక్క ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కాలం చేసిన గాయాలను గమనంలోకి తీసుకొని, మరోసారి గాయపడితే మనుగడే ప్రశ్నార్థకమవుతుందన్న నిర్ధారణతో మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇదొక వినూత్న ఆలోచన. విస్తృతస్థాయిలో రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే ప్రతిపాదన. కానీ బాబోజీ – రామోజీ కంపెనీతోపాటు దాని అనుబంధ కంపెనీ లకూ గుండెల్లో అణుబాంబు పేలినట్లయింది. ఈ ప్రభుత్వాన్ని తక్షణం గద్దె దింపవలసిన అగత్యం ఈ వ్యాపార ముఠాకు ఏర్పడింది. లక్షల కోట్ల కల గాలిలో దీపంలా మారడంతో ప్రభుత్వం మీద ఈ ముఠా యుద్ధాన్ని ప్రకటించింది. ఉచ్చమూ – నీచమూ అన్న ఇంగితం లేదు. న్యాయమూ – అన్యాయమన్న విచికిత్స లేదు. ధర్మమూ – అధర్మమన్న విచక్షణ లేదు. ప్రభుత్వం మీద బండలేయడమే ఏకైక కర్తవ్యంగా మారింది. ఈ కర్తవ్యంలో భాగమే ప్రతిరోజూ జరుగుతున్న విష ప్రచారం. రామోజీ పత్రిక ఛీనాడులో ప్రతిరోజూ శాపనార్థాలే బ్యానర్లు. ప్రజలకు ఉపాధి కల్పించే పరిశ్రమలకు ముఖ్యమంత్రి స్వయంగా శంకుస్థాపన చేస్తే అది లోపల పేజీ వార్తగా మారింది. ఒక గ్రామంలో రోడ్డు విస్తరణ కోసం ఇళ్ల ప్రహరీ గోడలను కూల్చేస్తే అది ప్రభుత్వ కక్ష అనే బ్యానర్ వార్తగా మారింది. అప్పటికే ఆ వరసలో యాభై ఇళ్ల ప్రహరీ గోడలు కూల్చారనీ, అందుకు ఆ ఇళ్ల యజమానులు సమ్మతించారనే వాస్తవాన్ని మాత్రం ఈ యెల్లో మీడియా విస్మరించింది. అంగీకరించని ముగ్గురు జనసేన కార్యకర్తల ఇళ్ల దగ్గరే ‘కక్ష’ సాధింపు రంగంలోకి వచ్చింది. పత్రికలో బ్యానర్ వార్త మాత్రమే సరిపోదని పాలిటిక్స్లో జూనియర్ ఆర్టిస్టుగా ఉన్న పవన్ కల్యాణ్ను రంగంలోకి దించారు. ఆయన తన శాయశక్తుల ఓవరాక్టింగ్ చేసి వెళ్లారు. అయ్యన్నపాత్రుడు అనే సీనియర్ రాజకీయవేత్త అమ్మనాబూతులు మాట్లాడుతుంటే ఛీనాడుకు కమ్మగా తోచింది. ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే, అందుకోసం ఒక రెవెన్యూ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేస్తే అయ్యన్నలో ఛీనాడుకు చిలిపితనం కనిపించింది. చేసింది తప్పు కనుక ప్రభుత్వం అరెస్ట్ చేస్తే ఛీనాడుకు కక్షసాధింపుగా కనిపించింది. వ్యక్తిగత ఫిర్యాదుతో సీఎం క్యాంపు కార్యాలయం దగ్గర ఒక మహిళ చేతికి గాయం చేసుకున్నది. ఇది ఛీనాడుకు బ్యానర్ శీర్షిక ‘నేను వినను, నేను కనను’! అంటే ముఖ్యమంత్రి ప్రజల సమస్యలను అస్సలు పట్టించుకోవడం లేదని దాని భావన. అంతకు ముందురోజే అధికారులతో స్పందన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. స్పందన కార్యక్రమాన్ని మరింత క్రియాశీలకంగా చేయాలని సూచించారు. ప్రజల వ్యక్తిగత ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడం కోసం మరింత మెరుగైన వ్యవస్థను తయారుచేయాలని నిర్దేశించారు. ఈ సంగతిని మాత్రం ఛీనాడు రాయలేదు. అధికార యంత్రాంగాన్ని ప్రజల గుమ్మం దగ్గరకు చేర్చడంలో జగన్మోహన్రెడ్డి చేసిన కృషి యావత్తు భారతదేశ చరిత్రలో సాటిలేనిది. ఒకటో తేదీ తెల్లవారుజామున వెలుగు రేకలు విచ్చుకోకమునుపే పెన్షన్ డబ్బులు చేతికందిస్తున్న రెండున్నర లక్షలమంది వలంటీర్ల మోముల్లో అవ్వాతాతలు జగన్మోహన్రెడ్డి ప్రతిరూపాన్ని చూసుకుంటున్నారు. ప్రతి పల్లెలో, ప్రతి వీధిలో సేవకు సిద్ధంగా నిలబడిన సచివాలయాల సిబ్బందిలో ప్రజలకు జగన్ ప్రభుత్వం రోజూ కనిపిస్తూనే ఉన్నది. ఉద్యోగులే కాదు, ఎమ్మెల్యేలూ, మంత్రులు సైతం ‘గడప గడపకూ జగన్ ప్రభుత్వం’ పేరుతో నిత్యం జనంలోనే తిరుగుతున్నారు. వారంతా జగన్ పంపితే వస్తున్నారని ప్రజలకు తెలియదా? ‘ఫ్యామిలీ డాక్టర్’ ట్రయల్ రన్ జరుగుతున్నది. ఎవరికి సుస్తీ చేసినా వారింటికే డాక్టర్ రాబోతున్నాడు. ఇక మీదట జగన్మోహన్రెడ్డి ఇంటింటి ఫ్యామిలీ డాక్టర్ కూడా! ఇంతకంటే ప్రజలకు చేరువైన నాయకుడు ఈ దేశంలో ఇంకెవరున్నారో చెప్పమంటే ఏం చెబుతారు? అటువంటి జగన్మోహన్రెడ్డి ‘నేను వినను – నేను కనను’ అంటున్నాడని శీర్షిక పెడతారా? ఇది సిగ్గులేనితనం కాదా! ఇది బరితెగింపు కాదా? ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యావ్యవస్థ అత్యున్నత ప్రమాణాలనందుకున్నదని కేంద్ర ప్రభుత్వ సంస్థ విడుదల చేసిన పీజీఐ నివేదిక చాటిచెప్పింది. పైగా నాలుగేళ్ల కిందటి ఇదే నివేదికలో రాష్ట్రం అట్టడుగు పొరల్లో ఉంది. రెండేళ్లు కరోనా వెంటాడిన నేపథ్యంలో ఈ పురోగతి ఒక వండర్! కానీ ఛీనాడు మాత్రం పాఠశాల విద్య పతనమైందని తెంపరితనంతో కూడిన వంట కథలను వండి వార్చింది. రైతు భరోసా కేంద్రాలను వ్యవసాయ రంగంలో విప్లవాత్మక పరిణామంగా దేశవిదేశాల్లోని వ్యవసాయ రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఛీనాడు, దాని అనుబంధ మీడియా మాత్రం రాష్ట్రంలో వ్యవసాయం పడ కేసిందని కథలు అల్లుతారు. ఒక విషయం స్పష్టం. ప్రజల చేతికి అధికారాన్ని ఇచ్చే జగన్ ప్రభుత్వ విధానంపై వ్యాపార – రాజకీయ వర్గం యుద్ధం ప్రకటించింది. ప్రజల ప్రయోజనాలకూ, స్వార్థశక్తుల ప్రయోజనాలకూ మధ్యన జరుగుతున్న యుద్ధం ఇది. బాబోజీ – రామోజీ కంపెనీ నేతృ త్వంలో ప్రభుత్వం మీద ప్రత్యక్షంగా, ప్రజల మీద పరోక్షంగా నిత్యం బాంబులు కురిపిస్తున్నారు. విషపూరితమైన రసాయన ఆయుధాలను ప్రయోగిస్తున్నారు. యుద్ధం ప్రకటించినవాడు ఎంతటి శక్తిమంతుడైనా, ఎంతటి ధనాఢ్యుడైనా ప్రజలు చైతన్య వంతులైతే తోక ముడవక తప్పదు. అమెరికా మీద వియత్నాం ప్రజల విజయం చాటిచెప్పిన పరమ సత్యమిదే! ఠ్చిటఛీజ్ఛి జీ1959ఃజఝ్చజీ .ఛిౌఝ మోసాల గురూజీ ఛీనాడు రామోజీ! ► ఎవరీ రామోజీరావు? ఒక వ్యాపారవేత్త. ఈనాడు సంస్థల అధినేత. ఫిలిం సిటీ ఓనర్. సినిమా నిర్మాత. కొంతమందికి గురుపుంగవుడు. అంతేనా? ఇంకా వుంది. స్వార్థంకోసం సొంత చుట్టాలను కూడా మోసం చేయడానికి వెనుకాడని కపటి. వ్యవస్థలను మేనేజ్ చేయగల ప్రావీణ్యంతో బంధువులను కూడా కోర్టుల చుట్టూ తిప్పి వాళ్ల భూముల్ని కారుచౌకగా కొట్టేసిన తిమింగలం. పత్రికను అడ్డం పెట్టుకొని కుళ్లు రాజకీయాలను రచించిన ఘనుడు. ► విలువైన భూములపై ఆయన కన్ను పడితే చాలు హస్తగతం చేసుకునేంతవరకూ ఎన్ని కుట్రలైనా చేస్తాడని ఒక సన్నిహిత బంధువు స్వయంగా చెప్పాడు. తన సువిశాల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకునే క్రమంలో వేసిన ప్రతి అడుగులో బంధువుల కన్నీటి మడుగులు, బడుగుల నెత్తుటి జాడలు కనిపిస్తాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇదిగో మచ్చుకు కొన్ని అడుగులు... ► విజయవాడ బెంజ్సర్కిల్ సమీపంలో ‘ఈనాడు’ కార్యాలయం ఉన్న రెండెకరాల స్థలం రామోజీది కాదు. బంధువు, భాగస్వామి, తోడల్లుడైన ముసునూరు అప్పారావు, వల్లూరి వెంకటేశ్వరరావుల నుంచి రూ. 725 అద్దెతో 33 ఏళ్ళకు లీజు తీసుకున్నది. అక్కడ ‘ఈనాడు’ బిల్డింగ్ కట్టిన రామోజీకి స్థలం కాజేయాలనే దుర్బుద్ధి పుట్టింది. లీజు ముగిసిపోతున్న వేళ మరో 33 ఏళ్ళ లీజు కావాలంటూ కోర్టుకెక్కారు. అప్పారావుకు ఆ స్థలం అప్పగించాలని ఆదేశిస్తూ, 2013లో కోర్టు మందలించినా లాభం లేకపోయింది. 2017లో జిల్లా కోర్టు చెప్పినా, మళ్ళీ కోర్టుకెక్కారు. తాత్సారం చేస్తున్నారు. లీజు ముగిసినా ఖాళీ చేయకపోగా, ఇవ్వాల్సిన అద్దెకు అతీగతీ లేదు. 1970 లెక్కల ప్రకారం చూసినా లక్షల్లో అద్దె బాకీ. సొంత బంధువు స్థలానికే శఠగోపం పెట్టాలని రామోజీ మార్కు విశ్వప్రయత్నం సాగుతూనే ఉంది. ► వైజాగ్లో డాల్ఫిన్ హోటల్ కథా ఇలాంటిదే. భూ యజమానుల్ని మాయమాటలతో బెదిరించి, కారుచౌకగా స్థలం కొట్టేశారు. మొదట విశాఖలోని అల్లిపురం దగ్గర 1970 ప్రాంతంలో 8210 చ. గజాల స్థలాన్ని 50 ఏళ్ళకు రామోజీ లీజుకు తీసుకున్నారు. స్థల యజమానుల డబ్బు అవసరాన్ని గ్రహించి, వాళ్ళను మభ్యపెట్టారు. లీజు గడువు ఇంకా 16 ఏళ్ళు ఉండగానే దాదాపు రూ. 150 కోట్ల విలువ చేసే ఆ స్థలాన్ని రూ. 2.5 కోట్లకే 2005లో తన పేర ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఆ రూ. 2.5 కోట్లను కూడా మన నిరుపేద రామోజీ మూడు వాయిదాల్లో కానీ చెల్లించలేకపోయారట. మరో గమ్మత్తేమిటంటే – డాల్ఫిన్ హోటల్స్లో రామోజీతో సహా 172 మంది షేర్ హోల్డర్లు. రామోజీకి 95 శాతం, అంటే 3.82 లక్షల పైగా షేర్లున్నాయి. కానీ, విశాఖ, విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీకి చెందిన మిగిలినవారికి లాభాల్లో కనీస వాటా కూడా చెల్లించడం లేదట. ► ప్రియా పచ్చళ్ళ కంపెనీ నిర్మాణ సమయంలోనూ రామోజీది ఇదే స్టైల్. విజయవాడ శివారు కానూరు సమీపంలో సొంత బావ నుంచి 2 ఎకరాల స్థలం లీజుకు తీసుకున్నారు. ఆ స్థలానికి వెనకే మరో 2 ఎకరాల స్థలం ఉంది. దానికి వెళ్ళాలంటే ప్రియా పచ్చళ్ళకిచ్చిన స్థలంలో నుంచే దారి. స్థలంలో నుంచి దారి ఇస్తామని మొదట ఒప్పుకున్న రామోజీ అలవాటుగా నాలుక మడత తిప్పారు. దారి ఇవ్వకుండా సొంతవాళ్ళనే ఇబ్బంది పెట్టారు. ఆ దారిలో వెళ్ళేందుకు ప్రయత్నించిన సొంత బంధువును తన పత్రికా బలంతో రాత్రి అంతా పోలీస్ స్టేషన్లో ఉంచారు. చివరకు ఆ బంధువు న్యాయస్థానాన్ని ఆశ్రయించి, తన స్థలానికి తాను వెళ్ళేందుకు దారి చేసుకోవాల్సిన పరిస్థితి తెచ్చారు. ►...ప్రతిచోటా కోర్టు నుంచి చీవాట్లు తిన్నా, తాను లీజుకు తీసుకున్న భూముల్ని సామ దాన భేద దండోపాయాలతో, తన చేతిలోని పచ్చ పత్రిక బలంతో కాజెయ్యడమే రామోజీ మార్కు నీతి, నిజాయతీ. ఈనాడు, మార్గదర్శి, ప్రియా... ఇలా ఆయన స్థాపించిన సామ్రాజ్యాల్లో చాలా భాగం లీజు భూముల లీగల్ కబ్జా లీలలే. న్యాయవ్యవస్థలోని కొందరు వ్యక్తుల సహకారంతో ప్రతి విషయంలో తప్పుడు మార్గాల్ని అన్వేషించే రామోజీ తన పత్రికలో ఇతరుల భూకబ్జాల గురించి రాస్తారు. గురివింద గింజనే గుర్తుకుతెస్తారు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
పొలంలో లంకెబిందెలు దొరికాయని, పక్క జిల్లాలు తిరుగుతూ..
సాక్షి,మదనపల్లె టౌన్(అన్నమయ్య) : బంగారమని చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్న నిందితులను మంగళవారం మదనపల్లె టూటౌన్ పోలీసులు పట్టుకున్నారు. సీఐ మురళీక్రిష్ణ, ఎస్ఐ చంద్రమోహన్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. వాల్మీకిపురం మండలం నకిరి మడుగు పంచాయతీ ముడోరపల్లె షికాపాళెంకు చెందిన బి.గోవిందు కుమారుడు బుక్కియార్ గిరి అలియాస్ గోవిందబాబు, అలియాస్ కోటేశ్వరరావు(23), పుంగనూరు మండలం పాళెంపల్లె శికారుపాళ్యంకు చెందిన షానోజి కుమారుడు ముడియార్ ముత్యాలప్ప(31), వైఎస్సార్ జిల్లా వీరబల్లి మండలం తాటిమాకులపల్లె షికారిపాళ్యంకు చెందిన విజయ్కుమార్ కుమారుడు రాణా విజయక్రిష్ణ(25) ఒక బృందంగా ఏర్పడ్డారు. వారు కొన్నేళ్లుగా వైఎస్సార్, అనంతపురం, చిత్తూరు జిల్లాలతోపాటు ఇంకా పలు చోట్ల తాము వ్యవసాయం చేస్తుండగా పొలంలో బంగారు పెద్ద ఎత్తున దొరికిందని, లంకబిందెలు ఇంట్లో దాచి ప్రభుత్వానికి తెలియకుండా పన్ను ఎగ్గొట్టి అమ్ముకోవాల్సి వస్తోందని అమాయకులను నమ్మించారు. పూసలను మొదట శాంపుల్గా బంగారును ఇచ్చి అడ్వాన్స్గా డబ్బులు తీసుకుంటారు. మొదటగా కొద్దిపాటి బంగారాన్ని చూపి తరువాత వారికే నకిలీ బంగారాన్ని అప్పచెప్పి వారి వద్ద నుంచి నగదును తీసుకుని పరారు అవుతారు. ఈ క్రమంలో వైఎస్సార్ జిల్లా బద్వేలుకు చెందిన ఓ వ్యక్తిని మదనపల్లెకి రప్పించి ఇక్కడ అతన్ని మోసగించి రూ.5.70 లక్షలు తీసుకుని పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలించి పథకం ప్రకారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.5.70 లక్షల నగదు, నకిలీ బంగారం పూసల దండలు స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ వీరి పైన పలు చోట్ల పూసలు చూపి బంగారం అని నమ్మించి మోసాలకు పాల్పడిన కేసులు ఉన్నట్లు సీఐ తెలిపారు. చదవండి: మాజీ ప్రేయసి ఇంకొకరితో చనువుగా ఉందని.. -
రుణాల మారటోరియం మోసాలతో జాగ్రత్త
న్యూఢిల్లీ: రుణాల నెలవారీ వాయిదాల చెల్లింపుల (ఈఎంఐ)పై మారటోరియం అమలు నేపథ్యంలో మోసగాళ్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఖాతాదారులను బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. ఈఎంఐ మారటోరియం మోసాల గురించి అవగాహన పెంచుతున్నాయి. కీలకమైన ఓటీపీ, పిన్ నంబర్ల వివరాలను ఎవరికీ ఇవ్వొద్దని సూచిస్తున్నాయి. ఖాతాల వివరాలను చోరీ చేసేందుకు సైబర్ క్రిమినల్స్, మోసగాళ్లు అనుసరిస్తున్న కొంగొత్త విధానాల గురించి అవగాహన కల్పించే దిశగా యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర బ్యాంకులు గత కొద్ది రోజులుగా ఖాతాదారులకు ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ పంపిస్తున్నాయి. ఈఎంఐల మారటోరియంపై సహకరిస్తామనే పేరుతో మోసగాళ్లు .. ఓటీపీ, సీవీవీ, పాస్వర్డ్ లేదా పిన్ నంబర్ల వివరాలను ఇవ్వాలంటూ ఫోన్లు చేసే అవకాశాలు ఉన్నాయని బ్యాంకులు తెలిపాయి. ఇలాంటి విషయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. అటు కరోనా వైరస్ బాధితులకు తోడ్పాటు అందించేందుకు ఉద్దేశించి ప్రధాని ప్రారంభించిన పీఎం–కేర్స్ నిధికి చందాల సేకరణ పేరుతో కూడా మోసాలు జరుగుతున్నాయని, వీటి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నాయి. ఎన్బీఎఫ్సీలకూ మారటోరియం... రుణాలపై మూడు నెలల మారటోరియం వెసులుబాటును నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలకు (ఎన్బీఎఫ్సీ) కూడా వర్తింపచేయాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) పరిధిలోని బ్యాంకులు యోచిస్తున్నాయి. తద్వారా కరోనా వైరస్ సంక్షోభం నుంచి అవి గట్టెక్కేందుకు తోడ్పాటు అందించాలని భావిస్తున్నాయి. తాము కూడా రుణగ్రహీతల కోవలోకే వస్తాం కాబట్టి తమకు కూడా మారటోరియం ఇవ్వాలంటూ ఎన్బీఎఫ్సీలు డిమాండ్ చేస్తున్నాయి. వివిధ వర్గాలకు రుణాలు ఇచ్చే ఎన్బీఎఫ్సీలు ప్రధానంగా నిధుల కోసం బ్యాంకులపైనే ఆధారపడుతుంటాయి. డిజిటల్ చెల్లింపులపై ప్రచారం... కరోనా వైరస్ కల్లోలాన్ని కట్టడి చేయడానికి కేంద్రం విధించిన లాక్డౌన్ సమయంలో డిజిటల్ చెల్లింపులను అనుసరించాలని ప్రజలను ఆర్బీఐ కోరింది. ఈ మేరకు అమితాబ్ బచ్చన్తో ట్విట్టర్ ప్రచారాన్ని ఆర్బీఐ ప్రారంభించింది. కరోనా వైరస్ విస్తరణకు అడ్డుకట్ట వేయడానికి సామాజిక దూరం పాటించడం సరైన చర్య అని ఆర్బీఐ తెలిపింది. -
యజమానినే ముంచేశారు..
పెదగంట్యాడ(గాజువాక): శ్రీకాకుళం నుంచి వచ్చారు. ఇల్లు అద్దెకు కావాలన్నారు.. మంచి వారని భావించిన ఇంటి యజమాని వారికి ఇల్లు అద్దెకు ఇచ్చారు. తర్వాత ఇరుకుటుంబాల వారు బాగా దగ్గరయ్యారు. ఒకరికొకరు కష్టసుఖాలను పంచుకునేవారు. ఇదే ఆ ఇంటి యజ మాని నిలువునా మోసపోవడానికి దారితీసింది. ఈ సంఘటన వివరాలను న్యూపోర్టు పోలీస్ స్టేషన్లో సీఐ పైడపునాయుడు విలేకరులకు బుధవారం వివరించారు. ఇంటి యజమానికి పెళ్లయినా పిల్లలు లేకపోవడంతో అతని మేనకోడలను రెండో పెళ్లి చేసుకున్నాడు. వారికి ముగ్గురు సంతానం కలిగారు. అయితే యజమాని ఇటీవల మొదటి భార్యతో చనువుగా ఉండడంతో రెండో భార్య తట్టుకోలేపోయింది. తన పరిస్థితిని వారి ఇంట్లో అద్దెకు ఉంటున్న వారితో వాపోయింది. ఇదే అదునుగా భావించి వారు ఆమెను నిలువునా ముంచేశారు. పూజల పేరిట రూ.4.20 లక్షల నగదుతో పాటు 7తులాల బంగారం, వెండి సామగ్రి దోచేశారు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి అసలు రంగు బయటపడింది. 62వ వార్డు టీజీఆర్ నగర్లో దవులూరి చంద్రరావు అ నే వ్యక్తి కుటుంబంతో నివాసం ఉంటున్నా డు. ఏడాది కిందట శ్రీకాకుళం జిల్లాకు చెందిన వానపల్లి సీతారాం, అతని తల్లి పద్మ, చెల్లెలు కుమారితో వచ్చి ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. చంద్రరావుకు వివా హమైనా పిల్లలు లేకపోవడంతో అతని మేనకోడలైన నిర్మలను మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇటీవల కాలంలో చంద్రరావు మొద టి భార్యతో చనువుగా ఉండడంతో తట్టుకోలేకపోయిన నిర్మల ఇంట్లో అద్దెకుంటున్న వారితో తన పరిస్థితిని వివరించింది. ఇదే అదునుగా భావించిన వారు ‘నీ భర్తకు ప్రాణగండం ఉంద ని, పూజలు చేయాల’ని నమ్మబలికారు. అంతేకాకుండా ఆ విషయాన్ని తన భర్తకు చెబితే రక్తం కక్కుకుని చనిపోతాడని భయాందోళనకు గురి చేశారు. దీంతో భయపడిన నిర్మల భర్తకు తెలి యకుండా రూ.4.20 లక్షల నగదు, 7తులాల బంగారం, వెండి వస్తువులను దఫదఫాలుగా వారికి అందజేసింది. తర్వాత తాను మోసపోయానని భర్తకు తెలియజేయడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను బుధవారం అరెస్టు చేశారు. వారి నుంచి నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఎస్ఐ శ్రీనివాస్, ఏఎస్ఐ అప్పలరాజు పాల్గొన్నారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement