నగరంలో మళ్లీ రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు | Chain Snatchers Attack on Women At Hyderabad city | Sakshi
Sakshi News home page

నగరంలో మళ్లీ రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు

Dec 23 2015 9:41 AM | Updated on Sep 3 2017 2:27 PM

హైదరాబాద్ నగరంలో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు.

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. రాజేంద్రనగర్లోని అత్తాపూర్లో బుధవారం నడిచి వెళ్తున్న మహిళపై దాడి చేసి... మెడలోని ఆరు తులాల బంగారం గొలుసు తెంచుకుని... అక్కడి నుంచి పరారైయ్యారు. అలాగే లంగర్హౌస్లో ఓ మహిళ మెడలోంచి చైన్ స్నాచర్లు మూడు తులాల బంగారాన్ని అపహరించి.. పారిపోయారు. సదరు బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫూటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement