'తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తుంది' | central govt supports to telangana government | Sakshi
Sakshi News home page

'తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తుంది'

May 20 2016 2:47 PM | Updated on Aug 20 2018 9:16 PM

రామగుండ ఎన్టీపీసీ కొత్త ప్రాజెక్టు ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తారని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు.

హైదరాబాద్ : రామగుండ ఎన్టీపీసీ కొత్త ప్రాజెక్టు ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తారని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలోని పవర్ సెక్టర్పై ఉన్నతాధికారులతో బండారు దత్తాత్రేయ సమీక్ష నిర్వహించారు. ఉదయ్ స్కీమ్లో తెలంగాణ ప్రభుత్వం కూడా చేరితే నష్టాల్లో ఉన్న డిస్కంలు రెగ్యులేట్ అవుతాయన్నారు.

సోలార్ విద్యుత్ ప్లాంట్ కోసం అనుమతులు త్వరగా ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తుందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement